నారాయణపేట, సెప్టెంబర్ 19 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ పార్టీలో ఉన్న ఏకైక (ధన్వాడ మండలం) జెడ్పీటీసీ విమల, ఆమె భర్త (బీజేవైఎం జిల్లా నాయకుడు) అంజియాదవ్ 400మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పేట పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సమక్షంలో మంగళవారం వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అదేవిధంగా మండలంలోని అభంగాపూర్, నెమళ్లపల్లి గ్రామాలకు చెందిన 100మంది బీ జేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, పట్టణానికి చెందిన 100మంది విశ్వబ్రాహ్మణ యువకులు, నాయకులు బీఆర్ఎస్లో చే రారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధిని చూసి అందరూ పార్టీలో చేరుతున్నట్లు చె ప్పారు. అభివృద్ధిలో భాగస్వాములవుతున్నందుకు సంతోషం గా ఉందని అంజియాదవ్ తెలిపారు. నిరంతరం ప్రజా శ్రేయ స్సు కోసం పని చేస్తున్న ఎమ్మెల్యే తమను పార్టీలోకి తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షానే ఉంటానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేందర్రెడ్డిని మూడోసారి లక్ష మెజార్టీతో గెలిపించాలన్నారు.