పాలమూరు, డిసెంబర్ 3 : మనోధైర్యంతో వైకల్యాన్ని జయించి సకలాంగులతో సమానంగా రాణించాలని డీఈవో రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ వైకల్యం శరీరానికే కాని మేథస్సుకు కాదన్నారు. అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో జయశ్రీ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పావని పాల్గొన్నారు.
హన్వాడ, డిసెంబర్ 3 : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాలరాజు అన్నారు. మండలకేంద్రంలో నిర్వహించిన ది వ్యాంగుల దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులు సకలాంగులతో సమానంగా రా ణించి అందరికీ ఆదర్శంగా నిలువాలని సూచించారు. అనంతరం దివ్యాంగులకు నోట్పుస్తకాలు, ఆట వస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో రాజూనాయక్, హెచ్ఎంలు లక్ష్మయ్య, భాస్కర్, ఉపాధ్యాయిని సంగీత, సత్యం, రమణారెడ్డి, వెంకటయ్య, యాదయ్య పాల్గొన్నారు.
దేవరకద్ర, డిసెంబర్ 3 : దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలని ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకద్ర భవిత విలీన విద్యాకేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిం చి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం ఆంజనేయులు, ఐఈఆర్డీ టీచర్ అనురాధ, అర్చన్న, శేఖర్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 3 : దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ దివ్యాంగ ఉద్యోగులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ శంకర్సింగ్, మేనేజర్ వెంకటేశ్వర్లు, ఉద్యోగులు లక్ష్మణ్, గీత, యాద మ్మ, పుణ్యలత, రామస్వామి, యాదయ్య, సత్య య్య, తిరుపతమ్మ, దేవమ్మ పాల్గొన్నారు.
మహ్మదాబాద్, డిసెంబర్ 3 : మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో దివ్యాంగులను జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు అన్నిరంగాల్లో రా ణించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎంలు బాలకృష్ణ, అనురాధ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి, ఎస్సీసెల్ అధ్యక్షుడు భీమయ్య పాల్గొన్నారు.