వనపర్తి, అక్టోబర్ 9 : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత సీఎం, ఎమ్మెల్యేలు తీసుకుంటారని, ఇందుకోసం మమ్మ ల్ని గెలిపించే బాధ్యత మాత్రం మీదేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రజలకు సూచించారు. సోమవారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జర్నలిస్టులకు ఇండ్లపట్టాలు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో ఊహించినదానికంటే ఎక్కువగానే అభివృద్ధి జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వంచే లబ్ధి పొందిన వారు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి నేరుగా నగదు వారి ఖా తాలో ప్రభుత్వం జమచేసిందన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశ పెట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమంలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవన్నా రు. రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ నిలిపారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాత, కొత్త నాయకులు సమిష్టిగా పని చేసి తిరిగి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీ రంతా ఏకపక్ష తీర్పును ఇస్తే నేను సిపాయిలా పనిచేస్తానని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మర్రికుంట ప్రాంతంలో విద్యుత్ సమస్యలను తొలిగించే క్రమంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అలాగే వల్లభ్నగర్లో రూ.14లక్షలతో నిర్మించిన మహిళా సమైఖ్య భవనాన్ని ప్రారంభించి క్యాం ప్ కార్యాలయంలో ఐసీడీఎస్ కింద 86మంది దివ్యాంగులకు గానూ, 16మందికి బ్యాటరీ వా హనాలను మంత్రి అందజేశారు.
బీఆర్ఎస్లోకి బీజేపీ, కాంగ్రెస్ నేతలు..
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘణపురం మండలంలోని ఆగారానికి చెందిన 100 మంది కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా పట్టణంలోని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కూమార్, జిల్లా ప్రతినిధి బాబురావు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే గోపాల్పేట, రేవల్లి మండలాలకు చెందిన జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని అంచనాలకు మించి సాగునీరు అందించడంతోపాటు ప్రతి రంగంలో అభివృద్ధి పర్చామని, దానిని చూసి ప్రజలు, ఇతర పార్టీలోని నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు నెల ల ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటించిందని, ఇప్పటి దాక వాళ్లు అభ్యర్థులు ఎవరు అనేదే ఇంత వరకు ప్రకటించలేని పరిస్థితిలో ఉన్నారని, అటువంటి వారికి అవకాశమిస్తే రాష్ర్టాన్ని, నియోజకవర్గాన్ని అంధకారంలో నెట్టివేయడం ఖాయన్నారు. అందుకే ప్రజలు ఆలోచించి పనిచేసేవారికి అండ గా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, మార్కెట్ చైర్మన్ రమేశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, ప్రేమ్నాథ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, నరసింహతోపాటు అధికారులు పాల్గొన్నారు.