మహబూబ్నగర్, డిసెంబర్ 5: ప్రతి ఫిర్యాదును పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులు ఫిర్యాదులను స్వీకరించినప్పుడు బాధ్యతగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే సోమవారం నూతన కలెక్టరేట్లోనే ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజావాణికి 47 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్నండ్లాల్పవర్, డీఆర్డీవో యాదయ్య, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, జెడ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
సమీకృత కలెక్టరేట్ భవనంలోకి కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధింత అధికారులతో మాట్లాడారు. అధికారులు తమకు కేటాయించిన భవనంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బుధవారం నుంచి సమీకృత భవనానికి అన్నిశాఖల కార్యాలయాలు విధులు నిర్వహించేలా చూడాలని ఆదేశించారు.
వైద్యం కారణంగా ముందస్తుగా ఉద్యోగ విరమణ కోరుతున్న ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని జిల్లాస్థాయి కమిటీ పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆరుగురు ఉద్యోగులు వైద్యం కారణాలపై ఉద్యోగ విరమణతోపాటు, వారసులకు వారసత్వ ఉద్యోగాల నియామకంపై దరఖాస్తులు చేసుకున్న కేసులను కలెక్టర్ పరిశీలించారు. ఒక్కొక్కరితో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఉద్యోగి ప్రస్తుత పరిస్థితిని పరిగణలోకి తీసుకోవడంతోపాటు అన్నివివరాలను పరిశీలిస్తామన్నారు. జిల్లా కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించి తమకు నివేదించాలని సూచించారు. అన్నిరకాలుగా అర్హత ఉన్నవారిని మాత్రమే మెడికల్పై రిటైర్మెంట్కు అనుమతించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆన్ వాలిడేషన్ జిల్లా కమిటీ సభ్యురాలు డాక్టర్ అమరావతి, డాక్టర్లు ఉన్నారు.