నారాయణపేట టౌన్, జూన్ 22: అమరవీరుల త్యాగా ల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం పట్టణంలోని జెడ్పీ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ కలెక్టర్ శ్రీహర్షతో కలిసి అమరవీరుల స్తూపం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అమరుల త్యాగాలను ఎల్లవేళలా స్మరించుకోవాలన్నారు. కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ అమరువీరుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీహర్ష అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సురేఖ, డీఆర్డీవో గోపాల్నాయక్, పౌరసరఫరాలశాఖ మేనేజర్ హతీరాం, ఎస్సీ సంక్షేమాధికారి కన్యాకుమారి, ఏవో నర్సింగారావు, జెడ్పీటీసీలు అంజలి, లావణ్య, సూర్యప్రకాశ్రెడ్డి, అశోక్గౌడ్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘన నివాళి
నారాయణపేట రూరల్ జూన్ 22: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అమరవీరుల స్తూపం చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఉత్త మ గ్రామ పంచాయతీ అవార్డు సాధించిన అప్పిరెడ్డిపల్లి సర్పంచ్ ప్రభావతి, పంచాయతీ కార్యదర్శిని ఘనంగా సన్మా నించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజు, సూపరింటెండెంట్ శోభారాణి, ఏపీవో, సిబ్బంది, సర్పంచులు,ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జాజాపూర్ పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది అమరుల స్తూపం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు నారాయణరెడ్డి, భీమేశ్, ఆశప్ప, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీసాయి స్కూల్లో అమరుల స్తూపం చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సాయిలీల, ఉపాధ్యాయులు అమీనా, బాలప్ప,నర్సింహ , విద్యార్థులు పాల్గొన్నారు.
మక్తల్లో..
మక్తల్ టౌన్, జూన్ 22: మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమర వీరుల స్తూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1969 నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. మలిదశ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు కేసీఆర్కు తోడుగా స్వరాష్ట్ర సాధనకోసం ఉద్యమించారన్నారు. 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రన్ని సా ధించుకున్నామన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ అమరులను స్మరించుకుంటూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుండడంతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందన్నారు. త్వరలో మక్తల్లో భారీ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమరులను స్మరించుకోవడం రాజకీయం చేయడం సరికాదన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు చీరాల సత్యనారాయణ, కొండయ్య, ఇర్ఫానా సుల్తానా, శంకరమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షు డు మహిపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి, అన్వర్ ఉస్సేన్, శంశుద్ధీన్, ఈశ్వర్ యాదవ్, బండారి శేఖర్, శేఖర్రెడ్డి, నేతాజీ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద, జూన్ 22: మండల కేంద్రంలో ఎంపీపీ బక్క నర్సప్ప ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు. ఎల్సాన్పల్లి, క్యాతన్పల్లి, విఠలాపూర్ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, యువకులు తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళుల ర్పించారు. ఆయా కార్యక్రమాల్లో తాసీల్దార్ ప్రమీల, ఎంపీడీవో శశికళ, ఎంపీవో రామన్న, సీనియర్ అసిస్టెంట్ దూసా వెంకట్రాములు, నాయకులు భీంరెడ్డి, కనికిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, జూన్ 22 : మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధు లు, అధికారులు అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాశోదమ్మ, ఎంపీవో బాలాజీ , సర్పంచ్ కస్పే గోవర్ధన్, ఎంపీటీసీలు గోపాల్, సూజాత, ఉప సర్పంచ్ శివకుమార్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు రాజేశ్, నాయకులు హెచ్.శ్రీనివాసులు, గూప నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ, జూన్ 22 : మండల పరిషత్ కార్యాలయం లో అధికారులు, ప్రజాప్రతినిధులు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యు డు వాహిద్ ఎంపీపీ పద్మినీబాయి, ఎంపీ టీసీలు మాధవి, సుధీర్కుమార్, ఎంపీడీవో సద్గుణ, మండల పరిషత్ కా ర్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలంలోని ఎంనోనిపల్లిలో సర్పంచ్ భారతి ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుల చిత్రపటం వద్దనివాళులర్పించారు.
కోస్గిలో..
కోస్గి, జూన్ 22: మండల పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, ఎంపీపీ మధుకర్రావు, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ఎంపీపీ సాయిలు, తాసీల్దార్ మమత, ఎంపీడీవో వెంకటయ్య, ఆయాగ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నర్వలో..
నర్వ, జూన్ 22 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జయరాములు శెట్టి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అమరవీరుల స్తూపం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వీణావతి, ఎంపీడీవో రమేశ్కుమార్, ఏపీఎం చంద్రశేఖర్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది బాలాజీ గౌడ్, రాఘవేందర్, రాము తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్లో…
ఊట్కూర్, జూన్ 22: మండలంలోని అన్ని గ్రామాల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటానికి ఘ నంగా నివాళులర్పించారు. మండలపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, ఎంపీడీవో కాళప్ప, సూపరింటెండెంట్ కొండన్న, ఆర్ఐ రామేశ్వరి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.