నారాయణపేట టౌన్, జనవరి 27 : విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ శ్రీ హర్ష సూచించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన గ్రూప్ 3, 4 శిక్షణా తరగతుల్లో 50 కన్నా ఎక్కువ హాజరు శాతం ఉన్న విద్యార్థులకు శుక్రవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
జంతువులపై కరుణ చూపించాలి జంతువులు, వన్యప్రాణులపై కరుణ చూపించాలని, ఎక్కడైనా వన్యప్రాణులు కనిపిస్తే అటవీ అధికారులు తెలపాలని లేదా వాటిని వదిలివేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నా రు. జనవరి 14 నుంచి 31 వరకు జంతు సంరక్షణ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధ కశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువులను హింసించడం, వాటిని బహిరంగంగా బలివేయడం, వన్యప్రాణులను వేటాడడం నేరంగా పరిగణించబడుతున్నదన్నారు. పెంపుడు జంతువులకు ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలన్నా రు. మాంసానికి ఉపయోగించే మేకలు, గొర్రెలను వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి అనారోగ్యం లేదని డాక్టర్ ధ్రువీకరణ పత్రం తీసుకున్న తర్వా త బహిరంగ ప్రదేశాల్లో కాకుండా స్లాటర్ వంటి కేంద్రాల్లో వధించాలన్నారు. కుటుంబ నియంత్ర ణ పద్ధతులతో వీధి కుక్కలను నియంత్రించాలని, రోడ్లపై కూర్చుంటున్న పశువులను గోశాలకు తరలించాలన్నారు. జంతువులను ఇరుకుగా ఉన్న వా హనాల్లో తరలిస్తే కేసులు నమోదు చేయాలన్నా రు. అనంతరం రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ రూ పొందించిన వాల్పోస్టర్ను విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్ట ర్ మయాంక్ మిట్టల్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాస్ తదితరు లు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
మన ఊరు – మన బడి మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల ను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని క లెక్టర్ కార్యాలయంలో టీఎస్ఈడబ్ల్యూడీఎస్ ఇంజినీర్లతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మన ఊ రు-మన బడి పనులు ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్య క్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు తయారు చేసి సకాలంలో కలెక్టర్ లాగిన్కు ఎందుకు పంపించలేకపోతున్నార ని ప్రశ్నించారు. కేవలం రూ.6కోట్ల47 లక్షల బిల్లులు మా త్రమే చెల్లించారని, బిల్లులు సకాలంలో చెల్లించకపోతే ప నులు ఎలా చేస్తారన్నారు. రానున్న 15 రోజుల్లో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఈ రాము, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
బుక్ చేసుకోవాలి
జిల్లాలో గృహ నిర్మాణాలు చేపట్టే యజమానులు ఇసుక కోసం మన ఇసుక మన వాహనం https://tsmiv.cgg. gov.in/home వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మాగనూర్ మం డలం వర్కూర్ గ్రామం వాగు నుంచి ఇసుక సరఫరా చే సేందుకు జిల్లా కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆన్లైన్ నుంచి బుక్ చేసుకున్న వారికి అదేరోజు లేదా త ర్వాతి రోజు సరఫరా చేయడం జరుగుతుందన్నారు.
పారదర్శకంగా నిర్వహించాలి
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ఎలాంటి అపోహలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అన్నారు. శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, మన ఊరు -మన బడిపై వీసీ నుంచి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయల బదిలీలు, పదోన్నతులపై కసరత్తు పూర్తి చేశామని పేర్కొన్నా రు. గెజిటెడ్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల సీనియార్టీ జాబి తా తయారు చేసి ప్రచురించామన్నారు. మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన కోసం ప్రత్యేక మెడికల్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలానికి రెండు చొ ప్పున మొత్తం 24 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్ద డం జరుగుతుందన్నారు. వీసీలో డీఈవో లియాఖత్ అలీ, ఏఎంవో విద్యాసాగర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మండలంలోని మహాద్వార్లో వెలిసిన గట్టు తిమ్మప్ప (వేంకటేశ్వర)స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగం గా శుక్రవారం ప్రభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని కొండపై నుంచి పల్లకీ సే వలో ఊరేంగింపు నిర్వహించారు. అలాగే రథోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా కర్నిలో గంటిరంగ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజేశ్వరరావు, ఆలయ ధర్మకర్త సురేందర్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
– మక్తల్, జనవరి 27
మండల వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ఆవరణలో క్రీడాకారులకు వాలీబాల్ నెట్ను షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపాలం అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయన్, పీఈటీ రమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
– మక్తల్ టౌన్, జనవరి 27