మహబూబ్నగర్, నవంబర్ 28 : అన్నిశాఖల అధికారులు విధినిర్వహణపై నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు.
జిల్లా సమీకృత కా ర్యాలయంతోపాటు వివిధ సముదాయాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేందుకు సీఎం కేసీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చే యాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. అనంతరం ప్ర జావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజావాణికి 96 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.