మహబూబ్నగర్, జూలై 25 : ప్రతి రోజూ టీ-హబ్కు వచ్చే నమూనాల వివరాలను, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వచ్చే ఔట్ పేషెంట్ల వివరాలను సమర్పించాలని కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. మంగళవారం ప్రభు త్వ ప్రధాన దవాఖానలో టీ-హబ్ కేంద్రాన్ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు ఎన్ని శాంపిల్స్ టీ-హబ్కు వస్తున్నాయని, శాంపిల్స్ ఫలితాలు ఎప్పుడు పంపిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా శాంపిల్స్ వస్తున్నది, లేనిది ఆయన పరిశీలించారు. పీ హెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వచ్చే ఔట్ పేషెంట్ల వివరాలను అలాగే జ్వరాల కేసుల వివరాలను తనకు సమర్పించాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళిలో ని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య చికిత్సకు వచ్చిన బాలేశ్వరి అనే మహిళతో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు చూసే వైద్యానికి మంగళవారం వైద్యానికి ఏ మైనా తేడా ఉందా అని అడగగా, మంగళవారం కేవలం మహిళలే ఉంటారని, వచ్చి వైద్య చికిత్సలు పొందుతున్నానని ఆమె తెలియజేశారు. పట్టణ ఆరోగ్య కేంద్రం పీవో శ్వేత, మెడికల్ అ ధికారి గౌతమి కలెక్టర్కు పలు విషయాలను వివరించారు. కా ర్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణ, సూపరింటెండెంట్ రాంకిషన్, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ జీవన్, టీ-హబ్ ఇన్చార్జి డాక్టర్ ప్రగతి ఉన్నారు.
ఆయిల్పాం తోటలను పెంచాలి
మహబూబ్నగర్, జూలై 25 : ఆయిల్పాం తోటల పెంపకంలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు పెద్ద ఎత్తున నాటాలని కలెక్ట ర్ రవినాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి ఆయిల్పాం కమిటీ సమావేశంలో కలె క్టర్ మాట్లాడారు. ఆయిల్పాంతోటల పెంపకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రతి జిల్లాకు ఒక లక్ష్యాన్ని నిర్ధేశించి ఆయిల్పాం తోటలను పెంచుతున్నదన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు మొదటి 200 ఎకరాల్లో, అనంతరం 2,100, ఈ సంవత్సరం 3,500 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు పెం చేందుకు లక్ష్యంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 900 ఎకరాలకు గానూ 600 ఎకరాల్లో రైతులు పెంచడం జరిగిందన్నారు. ఎక్కువ మంది రైతులు ఆయిల్ పాం తోటలను పెంచితే జిల్లాలోనే ఆయిల్పాం ఫ్యాక్టరీని నెలకొల్పి బైబ్యాక్ ప ద్ధతిన వీటిని కొనుగోలు చేసేందుకు మంచి అవకాశం ఉందన్నారు. ప్రీ యూనిక్ ఆయిల్పాం కంపెనీ డీజీఎం వై. రాంబా బు మాట్లాడుతూ ఇఫ్కో అనుసంధానంతో అవసరమైన సాంకేతిక సలహాలను, ఎరువులను అందుబాటులో ఉంచుతామన్నా రు. ఆయిల్పాం తోటల పెంపకంలో భాగంగా మైక్రో ఇరిగేషన్ కంపెనీలు సైతం వేగంగా డ్రిప్ పరికరాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్వామి, ఆయిల్పాం కం పెనీ అసిస్టెంట్ మేనేజర్ ప్రమోద్, అధికారులు మహేందర్, కే వీకే సంటిస్ట్ డాక్టర్ ఖోగరే దాదాసాహెబ్, తిమబాక్, రైతులు నర్సింహులు, లక్ష్మీనర్సింహ, ఉమాపతిరెడ్డి ఉన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. మంగళవారం భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. అధికంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఆర్అండ్ఆర్ కాలనీల్లో రహదారులు, మురుగు కాలువలు పూర్తి అయిన చోట తక్షణమే రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద మైనర్లు, సబ్ మైనర్లకు సంబంధించి అవార్డు స్థాయిలో ఉన్న వాటిని అవార్డులు పాస్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి అవార్డులు పాసైన చోట బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించాలని ఆదేశించారు. వివిధ ఇంజినీరింగ్ శాఖలు చేపట్టిన పనులపై శాఖల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎస్ఈ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
క్రమశిక్షణను అలవర్చుకోవాలి
పాలమూరు, జూలై 25 : జిల్లాలోని ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ప్రారంభించాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భారత్స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ భవన అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ నూతన కార్యవర్గంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా కలెక్టర్, సెక్రటరీగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, ఉపాధ్యక్షుడుగా మల్లారెడ్డి, బెక్కరి రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, వీణాశివకుమార్, ట్రెజరర్గా ధనుంజయ్రెడ్డి, ట్రైనింగ్ కమిషనర్గా హనుమంతు, విజయలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా స్వరూపరాణి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ రాజాగోపాల్, చీఫ్ కమిషనర్ మల్లారెడ్డి, ఇండియన్ రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షుడు నటరాజ్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపాధ్యక్షుడు అల్లారెడ్డి, బెక్కం రామిరెడ్డి పాల్గొన్నారు.