వనపర్తి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : కేవలం రూ.400లకు వంట గ్యాస్ను అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మహిళలకు ఈ శుభవార్తను అందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వంటింటి కష్టాలతోపాటు.. ఆర్థికంగా గట్టెక్కినట్లేనని మ హిళలు పేర్కొంటున్నారు. ఇంతకాలం ఎన్నో వ్యయప్రయాసాలు పడిన నిరుపేద కుటుంబాలకు బాసటగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో నారీలోకం ఆనందం వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వంతో సంబం ధం లేకుండా నేరుగా తక్కువ ధరకు సిలిండర్ను అందిస్తుండడంతో సర్వ త్రా హర్షం వ్యక్తమవుతున్నది. చాలా వరకు మహిళలకు ఊరట లభించింది. సబ్సిడీపోను మిగితా డబ్బును తెలంగాణ ప్రభుత్వం భరించనున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నిరుపేదలు, సామాన్యులకు మళ్లీ వంట గ్యాస్ అందుబాటులోకి రానున్నది.
గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడంతో నిరుపేద కుటుంబాలు గ్యాస్ వంటకు దూరమవుతున్నాయి. ఒక్క సిలిండర్ ధర ఒక్కో నెల ఒక్కో తీరులా ఉంటుంది. దాదాపు రూ.1200 ధర ఉండడంతో పేద, సామాన్యుడికి గుదిబండగా మారింది. ఈ క్రమంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్నా… చాలా మంది నిరుపేదలు మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీ అంతంత మాత్రంగానే ఉండటంతో సిలిండర్ ధర అమాంతం పెరిగింది. దీంతో నిరుపేదలకు మళ్లీ ఒంటింటి కష్టాలు దాపురించాయి. స్టౌ.. సిలిండర్లు ఉన్నా.. అవి నిరుపయోగంగానే మిగిలిపోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో ఉన్నత వర్గాలకు చెందిన వారు మినహా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక భారంతో సిలిండర్కు దూరమవుతున్నారు.
రూ.400కే సిలిండర్ను అందిస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో వనపర్తి జిల్లాలో లక్షా 18 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. వీటిలో జనరల్ కనెక్షన్లు 58 వేలు, దీపం పథకం కింద 38 వేలు, ఉజ్వల పథకంలో 17 వేలు, సీఎస్ఆర్
పథకంలో 4,200 గ్యాస్ కనెక్షన్లు ఉన్నా యి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 గ్యాస్ ఏజెన్సీల ఉన్నాయి.