సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : డ్రైడేలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు
మహబూబ్నగర్టౌన్, జూన్ 24 : వ్యాధుల నివారణకు పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. శుక్రవారం డ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని రెండోవార్డు ఏనుగొండ లో పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. అలాగే ఇంటింటికెళ్లి నిల్వ నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిశుభ్రత పా టించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం లో వైస్ చైర్మన్ తాటి గణేశ్, కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు రామాంజనేయులు, వనజ, పటేల్ ప్రవీణ్, కట్టా రవికిషన్రెడ్డి, నీరజ, అనంతరెడ్డి, షబ్బీర్, అనంద్గౌడ్, షేక్ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్యం లోపించొద్దు
భూత్పూర్,జూన్ 24 : మున్సిపాలిటీలో పారిశుధ్యం లోపించకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ కోరారు. మున్సిపాలిటీలోని 10వ వార్డులో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇండ్లల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించా రు. కార్యక్రమంలో కమిషనర్ నూరుల్ నజీబ్, మేనేజర్ అశోక్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి
జడ్చర్ల, జూన్ 24 : ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యా ధుల వ్యాప్తిని అరికట్టాలని డీపీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో కృష్ణ అన్నారు. మండలంలోని మల్లెబోయిన్పల్లిలో పర్యటించి సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే ఇంటింటికెళ్లి నీటి నిల్వలను తొలగించారు. వానకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా ఇండ్ల మధ్య నీటి నిల్వలు లేకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మమ్మ, జిల్లా మలేరియా నివారణాధికారి విజయకుమార్, జా నకీరాం, రమేశ్, ఎంపీవో జగదీశ్, మాజీ ఎంపీపీ బూర్ల వెంకటయ్య పాల్గొన్నారు. అలాగే పోచమ్మగడ్డతండాలో ఎంపీడీవో ఉమాదేవి పర్యటించి నీటినిల్వలను తొలగించారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్ : ఏనుగొండలో నీటిని తొలగిస్తున్న మున్సిపల్ చైర్మన్ నర్సింహులు
మహబూబ్నగర్ రూరల్ : కోడూర్లో నిల్వ నీటిని తొలగిస్తున్న సర్పంచ్, సిబ్బంది
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
జడ్చర్లటౌన్, జూన్ 24 : వ్యాధుల బారి న పడకుండాప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని 3,13, 24 వార్డుల్లో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, మున్సిపల్, వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి నీటి నిల్వలను తొలగించడంతో పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో కౌన్సిలర్లు సతీశ్, నందకిశోర్గౌడ్, ప్ర శాంత్రెడ్డి, ఆర్పీలు సరిత, స్వాతి, శ్యామల, పెంటమ్మ, శ్రీలత, ప్రమీల, ఆసియాసుల్తానా, ఆశ కార్యకర్తలు జ్యోత్స్న, నూర్జహా న్, లక్ష్మీదేవి, చంద్రకళ, ఏఎన్ఎం సుజాత, మున్సిపల్ సిబ్బంది కృష్ణయ్య, రమేశ్, సాయిరాం, అంగన్వాడీ టీచర్లు మాణిక్య మ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలంలో..
మహబూబ్నగర్ రూరల్, జూన్ 24 : మండలంలోని కోడూర్, దివిటిపల్లి గ్రామా ల్లో డ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించడంతోపాటు నిల్వ నీటిని తొలగించారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీ కాంత్గౌడ్, జరీనాబేగం, ఎంపీటీసీ రాజు, పంచాయతీ కార్యదర్శులు కృష్ణయ్య, వీరలింగం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచ ర్లు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జూన్ 24 : వ్యాధుల ని వారణకు ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలని సర్పంచ్ కృష్ణయ్య కోరారు. మండలకేంద్రంలో పరిసరాల శుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే ఇండ్లల్లో ఎక్కువ రోజులపా టు నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. కాలనీల్లో మురుగు నిల్వకుండా చర్యలు తీ సుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.