మిడ్జిల్, జనవరి 9 : యువత క్రీడల్లో రాణించి మంచిపేరు తెచ్చుకోవాలని జడ్చ ర్ల సీఐ జములప్ప సూచించారు. మండలకేంద్రంలో బీఎస్ఎన్ఎల్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఎంపీఎల్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చే సుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడు తూ క్రీడలతో మంచి స్నేహబంధాలు ఏర్పడడంతోపాటు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు. ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో సర్పంచుల సంఘం మండల అధ్యక్షు డు జంగిరెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ అల్వాల్రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లా కబడీ అసోసియేషన్ అధ్యక్షు డు జనార్దన్రెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, రాజేశ్వర్, సంపత్కుమార్, గిరినాయక్, సురేశ్, తిరుపతి, బీఆర్ఎస్వీ తాలూకా ఇన్చార్జి భాస్కర్, నిస్సార్ పాల్గొన్నారు.
క్రీడాస్ఫూర్తిని చాటాలి
నవాబ్పేట, జనవరి 9 : క్రీడాకారులు ప్రశాంత వాతావరణంలో ఆటలు ఆడి క్రీడాస్ఫూర్తిని చాటాలని సర్పంచ్ సౌజన్యారఘు అన్నారు. మండలంలోని కొల్లూరులో సోమవారం కేపీఎల్ క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేసి క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా భా వించాలని కోరారు. అనంతరం క్రీడాకారులకు టీషర్టులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చందర్నాయక్, ఎంపీటీసీ తుల్సీరాంనాయక్, ఉపసర్పంచ్ నర్సింహాచారి, నాయకులు రఘు, రాజు, రమేశ్, పసుల శివకుమార్, కృష్ణయ్య, నరేశ్చారి, చెన్నకేశవులు, శ్రీనివాస్యాదవ్, రామకృష్ణ, మల్లేశ్యాదవ్, అరవింద్, ప్రతాప్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందన
మూసాపేట, జనవరి 9 : ఇటీవల జడ్చర్లలో నిర్వహించిన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్పిప్- 2023లో మూసాపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభకనబర్చి పతకాలు సా ధించారు. వివిధ విభాగాల్లో విద్యార్థినులు అఫ్రీన్ మొదటి, కావేరి ద్వితీయ, గీత తృతీయ, శృతిహాసిని నాల్గోస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థినులను హెచ్ఎం భాస్కర్, ఎస్ఎంసీ చైర్మన్ ఉందెకోడు తిరుపతయ్య, పీఈటీ శశికళ అభినందించారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జా తీయస్థాయి పోటీల్లో రాణించడం సంతోషంగా ఉందని తెలిపారు. క్రీడల్లో మరింత ప్రతిభకనబర్చి పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు.