నవాబ్పేట, జనవరి 21 : మండలంలోని కొల్లూరు శివారులో ఉన్న చింతలపురి చిన్మయస్వామి మఠం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. చిన్మయస్వామి మఠం రజతోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన మహారుద్రయాగంలో పాల్గొని పూజలు చేశారు.
అనం తరం మఠం అభివృద్ధికి రూ.1.16 లక్షల విరాళాన్ని ఎంపీ అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన 450 జంటలతో మహారుద్రయాగం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, విండో చైర్మన్ నర్సింహులు ఉన్నారు.