మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 2 : ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పకుండా రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేయించాలని జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ అ న్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కా ర్యాలయంలో పల్స్పోలీయో వ్యాక్సిన్ కార్యక్ర మం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికారి కృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్వో మా ట్లాడుతూ జిల్లాలోని లక్ష మంది పిల్లలకు పోలి యో వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. ఇప్పటికే ఏ ర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్ బాబుల్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీధర్ బాబు, డీఐవో డాక్టర్ శంకర్, పీవో టీబీ డాక్టర్ రఫీక్, డెమో అధికారి డాక్టర్ తిరుపతిరావు, సీడీపీవో,ఏఎన్ఎంలు, ఆశలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గ్గొన్నారు.
నారాయణపేట టౌన్, మార్చి 2 : ఐదేండ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలి యో చుక్కలు వేయించాలని డీఎంహెచ్వో డా క్టర్ సౌభాగ్యలక్ష్మి అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద పల్స్పోలియో అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో 409 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నా రు. 59,036 మంది చిన్నారులను గుర్తించామని, మొదటి రోజు పోలియో కేంద్రాల్లో వైద్య బృందాలు చిన్నారులకు చుక్కల మందు వేసే లా ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో డీ ఐవో డాక్టర్ శైలజ, ఎంపీహెచ్ఈవో గోవిందరాజు, ఎస్యూవో అశోక్కుమార్ ఉన్నారు.
మరికల్, మార్చి 2 : పోలియో రహిత స మాజాన్ని నిర్మిద్దామని డాక్టర్ రాఘవేంద్రరెడ్డి అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డనుంచి ఐదేండ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో మందు వేయించాలని చెప్పారు. శనివారం స్థా నిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది అరవింద్, బస్వరాజ్, వెంకటేశ్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
భూత్పూర్, మార్చి 2: పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు స్థానిక ప్రాథమిక వైద్యాధికారి అబ్దుల్ రబ్బు చెప్పారు. ఈ మేర కు శనివారం పట్టణంలో అవగాహన ర్యాలీ ని ర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో 36కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
మిడ్జిల్, మార్చి 2 : పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యాధికా రి శివకాంత్ తెలిపారు. శనివారం మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో మండల కేం ద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కా ర్యక్రమంలో వైద్య సిబ్బంది జంగయ్య, దేవ య్య, సంపత్కుమార్, ఏఎన్ఎంలు ఉన్నారు.
ధన్వాడ, మార్చి 2: మండల కేంద్రంలో ఆరోగ్య శాఖ సిబ్బంది శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగజ్యోతి మా ట్లాడుతూ ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చు క్కలు వేయించాలన్నారు. కార్యక్రమంలో వై ద్య సిబ్బంది కథలప్ప, శోభారాణి, శ్రీదేవి, ప ద్మ, సుమిత్ర, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఊట్కూర్, మార్చి 2 : చిన్నారులను అంగవైకల్యం నుంచి కాపాడుకునేందుకు విధిగా చు క్కల మందు వేయించాలని పీహెచ్సీ వైద్యురా లు భవాని అన్నారు. శనివారం ఊట్కూర్, పు లిమామిడి, నిడుగుర్తి గ్రామాల్లో వైద్య శాఖ ఆ ధ్వర్యంలో పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించా రు. కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో విజయకుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.