అమరచింత, మార్చి 17: మండలంలోని కొంకనోనిపల్లి గ్రామానికి చెందిన శిరీషకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. కాగా మహిళను పరీక్షించిన వైద్యులు శిశువు మెడకు పెద్దపేగు చుట్టుకుందని, సిజేరియన్ చేస్తేనే ప్రసవం సాధ్యమవుతుందని జిల్లా దవాఖానకు రెఫర్ చేశా రు.
ఈఎన్టీ యశోద, పైలట్ యుగేందర్ అంబులెన్స్లో ఆదివారం జిల్లా దవాఖానకు తరలిస్తుండగా మదనాపురం మండలంలోని తిరుమలపురం శివారులో శిరీషకు పురిటినొప్పులు అధికం కావడంతో ఈఎన్టీ, ఫైలట్ అంబునెల్స్లోనే ప్రసవం చేయగా ఆడబిడ్డను జన్మనిచ్చింది. కాగా తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఎంసీహెచ్లో చేర్పించి.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.