పెంట్లవెల్లి, మే 5: మండలంలోని జటప్రోల్ గ్రామంలో ని అతిపురాతన ఆలయంలో వెలిసిన మదన గోపాలస్వామి రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కనులపండువగా నిర్వహించారు. గత 40 ఏండ్ల కిందట పాత జటప్రోల్ గ్రామంలో మదన గోపాలస్వా మి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవా న్ని అంగరంగా వైభవంగా నిర్వహించేవారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా పాత జటప్రోల్ ముంపునకు గురవడంతో 1982లో కొత్త జటప్రోల్లో ఆలయా న్ని నిర్మించారు. కానీ పాత జటప్రోల్లో ఉన్న రథం శిథిలావస్థకు చేరడంతో దానిని తరలించలేదు. అప్పటినుంచి తాత్కాలికంగా రథాన్ని ఏర్పాటు చేశారు. 40 ఏండ్ల తర్వాత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా సర్పంచ్ ఖాజా ఆధ్వర్యంలో 35 అడుగుల రథాన్ని ఏర్పాటు చేశారు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరై రథంతోపాటు స్వామికి ప్రత్యేక పూ జలు చేశారు. అనంతరం ఆలయకమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి తనవంతు సహకా రం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు గ్రా మంలో రూ.4లక్షలతో ఏర్పాటుచేసిన హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాజా ఆదిత్య లక్ష్మణరావుతో కలిసి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మండల నాయకులు రాజేశ్, శేషేంద్రప్రసాద్, సింగిల్విండో చై ర్మన్ విజయరామారావు, సర్పంచులు ఖాజా, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవం
మండలకేంద్రం సమీపంలో నిర్మించిన జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్ర తిష్ఠాపనోత్సవం చివరిరోజు (శుక్రవారం) గణపతి పూ జ, పుణ్యాహవాచనం, ప్రత్యేక హోమాలు నిర్వహించా రు. జగన్మాత ఈశ్వరీదేవి మఠాధిపతి శ్రీవీరశివకుమారస్వామి, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఆ స్థానకవి బ్రహ్మశ్రీ పెదపాటి నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో శ్రీ గోవిందమాంబా, వీరబ్రహ్మేంద్రస్వామి, సిద్ధయ్య, మాత ఈశ్వరీదేవిమూర్తి విగ్రహాల ప్రతిష్ఠతోపాటు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయకమిటీ సభ్యు లు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రహరీ నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.10లక్షలు ఇస్తానన్నారు.
అంతకు ముందు జగన్మాత ఈశ్వరీదేవి మఠాధిపతి శ్రీవీరశివకుమారస్వామి, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి మ ఠం ఆస్థానకవి బ్రహ్మశ్రీ పెదపాటి నాగేశ్వర్రావు పీఠాదిపతులకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పలు గ్రామాల ప్ర జలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూ జలు చేశారు. భక్తులకు ఎంపీటీసీ సుమలత శేషేంద్రప్రసాద్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్డీవో హనుమానాయక్, తాసీల్దార్ దామోదర్, బీఆర్ఎస్ మండల నాయకులు రాజేశ్, వెంకటేశ్వర్లు, నరేందర్రెడ్డి, విజయరామారావు, ఎంపీటీసీ సుమలత, రమణయాదవ్, సుదర్శనాచారి, ఆనందాచారి, శివశంకరాచారి, బాబాచారి ఉన్నారు.