ఉండవెల్లి, ఏప్రిల్ 2 : ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని పుల్లూరు చెక్పోస్టు వద్ద మంగళవారం భారీగా నగదు పట్టుబడింది. కర్నూల్ జిల్లా కోడుమూరుకు చెందిన బుడగ జంగాల సవారి వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దుస్తుల కొనుగోలుకు హైదరాబాద్కు కారులో వెళ్తుండగా ఎఫ్ఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టగా.. రూ.10.04 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అలాగే కర్నూల్కు చెందిన డీకే కరుణాకర్రెడ్డి కారులో వెళ్తుండగా.. అధికారులు వాహనాన్ని తనిఖీ చేసి రూ.లక్ష నగదును గుర్తించారు. వీరి వద్ద ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో జిల్లా గ్రీవెన్స్ కమిటీ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. చెక్పోస్టును గద్వాల డీఎస్పీ సత్యనారాయణ తనిఖీ చేశారు. రాష్ట్రంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతివ్వాలని ఆదేశించారు.