నారాయణపేట టౌన్, డిసెంబర్ 7 : భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టు కాల్వ పనులు త్వరతిగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. భీమా, కో యిల్సాగర్ కాల్వ పనులకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ పూర్తి చేసి పనులు చేపట్టాలన్నారు. భీమా ప్రాజెక్టు కింద ఒక ప్యాకేజ్లో 50 ఎకరాలు, మరో ప్రాజెక్టులో 83 ఎకరాల భూ సేకరణ పూర్తి చేసి ఇరిగేషన్ శాఖకు అప్పగించాల్సి ఉందన్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు కాలువకు సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ముంపు గ్రామాల పునరావాసంపై త్వరగా చర్యలు తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ శివధర్మ తేజ, దేవరకద్ర డివిజన్ ఈఈ ప్రతాప్ సింగ్, మక్తల్ ఈఈ సంజీవ ప్రసాద్, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికలు సిద్ధ్దం చేయాలికలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవో, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించి కంటి వెలుగు, ప్రధానమంత్రి సురక్షా యోజన, పల్లె ప్రగతి, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ కంటి వెలుగు కార్యక్రమం నుంచి నేత్ర పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్యం, అద్దాలు అందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తం గా 24 టీంలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో విధులు నిర్వర్తిస్తున్న శానిటేషన్, మల్టీలెవల్ వర్కర్స్ల్లో ప్రతిఒక్కరికీ ప్రధానమంత్రి సురక్షా యోజన బీమా, పీఎంజేజేవై ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. గ్రామ కార్యదర్శులు తమ సెల్ఫోన్ల్లో పల్లె ప్రకృతి వనాల యాప్ను డౌన్లోడ్ చేసుకొని పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాల ఫొటోలను ఆప్లోడ్ చేయాలన్నారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన క్రీడాప్రాంగణాలకు ఎఫ్టీవో ఆప్లోడ్ పూర్తి చేసి పేమెంట్లు పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు రూ.250 కూలి వచ్చేలా చూడాలని, ఈ సారి నర్సరీల్లో 26లోల మొక్కలు పెంచేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, డీఆర్డీవో పీడీ గోపాల్నాయక్, డీఎంహెచ్వో రామ్మనోహర్రావు, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఎల్పీవో సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని సిగ్నల్గడ్డలో తాసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి వినియోగిస్తున్న సెంట్రింగ్ సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తు లు చోరీ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. దాదాపు రూ.20వేలు విలువజేసే సామగ్రిని ఎత్తుకెళ్లారని, బాధితుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.