మహబూబ్నగర్ టౌన్/హన్వాడ, సెప్టెంబర్ 23 : మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లి నుంచి పాలకొండ బైపాస్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. మహబూబ్నగర్-కోస్గి-చించోలి హైవే నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న బైపాస్ పనులను శనివారం చిన్నదర్పల్లి గ్రామ సమీపంలో మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూ తన బైపాస్ నిర్మాణంతో భారీ వాహనాలు మహబూబ్నగర్ పట్టణంలోకి రాకుండా నేరుగా రాయిచూర్, కోస్గి, హైదరాబాద్, కొత్తకోట వైపు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. పట్టణ శివారు కాలనీలు ఈ బైపాస్తో అభివృద్ధి చెందుతాయన్నారు.
హన్వాడ ఫుడ్పార్క్ నుంచి దివిటిపల్లి, ఐటీ కారిడార్ చేరుకునేందుకు ఎంతో అనువుగా ఉంటుందన్నా రు. బైపాస్ ప నులు వేగంగా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేపట్టాలని ఆదేశించా రు. మహబూబ్నగర్ను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. చౌరస్తాలు, రోడ్లు విశాలంగా నిర్మించామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు అమలుచేస్తున్నామన్నారు. పట్టణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం హన్వాడలో బుద్ధరామ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవికోకిల భారతదేశం సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గుర్రం జాఘవా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బాలకిష్టయ్య, జంబులయ్య, వెంకటయ్య, నాగన్న, ప్రవీణ్కుమార్, శ్రీనివాసులు, గంగాపూరి తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు, సెప్టెంబర్ 23 : ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ప్రగతికి విఘ్నాలు రా కుండ చూడాలని గణనాథుడిని వేడుకున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కమలాగార్డెన్స్, ఎర్రసత్యం చౌరస్తా, క్లాక్టవర్ వద్ద ఏర్పాటు చేసిన మండపాల వద్ద గణేశ్కు పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రూ.50 లక్షలతో గణేశ్భవన్ నిర్మించామన్నారు. నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ వెంకన్న, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ షబ్బీర్అలీ, కౌన్సిలర్లు కిశోర్, రాంలక్ష్మణ్, నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మహ్మదాబాద్, సెప్టెంబర్ 23 : మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి పార్థివదేహానికి పరిగిలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మధవి, నాయకులు పెంట్యానాయక్, లక్ష్మీనారాయణ ఉన్నారు.