కొల్లాపూర్, అక్టోబర్ 26: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ నిలుస్తారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ్దన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని ఎస్ఎం గార్డెన్లో కొల్లాపూర్ మండల బీఆర్ఎస్ ముఖ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని మండల పార్టీ అధ్యక్షుడు రామచందర్యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాశ్రావు ముఖ్య అతిథులుగా హాజరైమాట్లాడారు.ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ తెలంగాణలో సబ్బండవర్గాలకు లబ్ధ్ది చేకూర్చే విధంగా సీఎం రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోను పార్టీ శ్రేణులు ఇంటింటికీ తీసుకెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. గతంలో జూపల్లి మన ఓట్లను అడ్డుకొని అభివృద్ధ్ధిని విస్మరించారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో జూపల్లిని మళ్లీ ఓడించి శాశ్వతంగా ఇంటికి పంపితే కొల్లాపూర్కు పట్టిన పీడ విరగడవుతుందన్నారు. 40ఏళ్ల క్రితం నుంచి ఎర్రగట్టు బొల్లారం నిర్వాసితులు బతుకుతుంటే వారికి నివేశన స్థలాలకు తాను పట్టాలు పంపిణీ చేస్తే రాజకీయంగా జీర్ణించుకోలేక పట్టాలు ఎట్లా ఇస్తారని డీఎఫ్వోకు జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజమని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ఎన్ని కష్టాలు వచ్చినా మీకు అండగా ఉంటానన్నారు. కుడికిళ్ల భూ నిర్వాసితుల పక్షాన తాను అండగా ఉండి న్యాయం చేయమని కోరితే, జూపల్లి బాధిత రైతులను బెదిరించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఓరే..సన్యాసి..నీకు సిగ్గు ,బుద్ది ఉంటే ఇది వరకే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పూర్తయి రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగు నీరందేదని జూపల్లి చేసిన నిర్వాకంపై ఎమ్మెల్యే బీరం మండిపడ్డారు. జూపల్లి, కాంగ్రెస్ నాయకులకు అధికారమిస్తే మనపని గోవిందా అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో శ్రీకృష్ణుడి దేవాలయం భూమిని బ్యాంకులో తనఖా పెట్టి భక్తులకు శఠగోపం పెట్టిండని, పెద్దదగడలో రామలింగేశ్వరాలయం భూములను సైతం జూపల్లి వదలలేదని ఆరోపించారు. రెండోసారి తనను గెలిపిస్తే నిరుపేదల కుటుంబాలకు చెందిన వంద మందికి సామూహిక వివాహాలను ప్రతి సంవత్సరం జరిపిస్తానని అన్నారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి సీఎం కేసీఆర్ రుణ తీర్చుకుందామని, తనను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేయించి రెండోసారి గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశా,నిర్దేశం చేశారు.
మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చూయించేది అభయహస్తం కాదు.. శూన్య హస్తం, రిక్తహస్తం అని బీఆర్ఎస్ రాష్ట నాయకుడు రంగినేని అభిలాశ్రావు విమర్శించారు. నీ జీవోలు బోగస్.. నీ మాటలు బోగస్, నీ వాట్సప్ ప్రచారాలు బోగస్ అంటూ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెల కాపరుల సహకార సంఘం అధ్యక్షులు గాలియాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నిరంజన్, చంద్రశేఖర్శెట్టి, పరశురాంగౌడ్, ఎంపీటీసీలు, సర్పంచులు మాట్లాడారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎన్మన్బెట్లలో కాంగ్రెస్కు చెందిన 38 మంది, ఆదిరాలలో 42 మంది, పట్టణంలో 7వ వార్డుకు చెందిన 40 బుధవారం రాత్రి కొల్లాపూర్లో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాశ్రావు సమక్షంలో గులాబీ దండులో చేరారు. పార్టీ కండువాలను కప్పిన ఎమ్మెల్యే వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో లక్ష్మణ్రావు, ధర్మయ్య, ఉస్సేన్, భాస్కర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.