తెలంగాణ ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ రాకతో జడ్చర్ల పులకించింది. జడ్చర్ల పట్టణంలో ఎటుచూసినా బీఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మందికి పైగానే జనం తరలివచ్చారు. బస్సులు, ఆటోల్లోనే కాకుండా పాదయాత్రగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. పట్టణ ప్రధాన కూడళ్లన్నీ గులా బీమయంగా మారాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గులాబీ జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీలు తీశారు. దీంతో సభా ప్రాంగణం అంతా జనసందోహంగా మారింది. ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. జై కేసీఆర్..జై తెలంగాణ..జై లక్ష్మారెడ్డి అన్న నినాదాలు మార్మోగాయి.
-జడ్చర్ల టౌన్, అక్టోబర్ 18
సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో సభా ప్రాంగణానానికి చేరుకోగానే జనం గులాబీ జెండా లు, కండువాలు చేతబట్టుకొని చేతులెత్తి స్వా గ తం పలికారు. సభ లో కళాకారులు ప్ర కాశ్ ఆటాపాట ఆలరించాయి. సీఎం కేసీఆర్ సభా వేదికపైకి చేరుకోగానే సభలో పెద్ద ఎత్తున నినాదాలు..హర్షధ్వానాలతో సభాప్రాంగ ణం మార్మోగింది. యువత పెద్దఎత్తున సీ ఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి..లక్ష్మారె డ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదా లు చేశారు. సభ ప్రాంగణంతోపాటు చుట్టూ రెండు కిలోమీటర్ల మేర జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం కేసీఆర్కు ప్రజలకు అభివా దం చేస్తూ సభా వేదికపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల లక్ష్మారెడ్డితోపాటు పలువురు నాయకులు కేసీఆర్ను కలిసి ఆశీర్వా దం తీసుకున్నారు. మైనార్టీ నాయకుడు మసీయొద్దీన్ సీఎం కేసీఆర్కు దట్టి కట్టా రు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు యు వత ఉత్సాహంగా ఈలలు వే స్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ వస్తే గ్యారంటీగా కరెంట్ కట్.. 24గంటల కరెంట్ ఉం డాలనకునే వారు చేతులు ఎత్తాలని సీఎం కేసీఆర్ చెప్పగానే సభలో ఉన్నవారంతా గులాబీ కండువాలతో చేతులెత్తి మద్దతు పలికారు.
సాయంత్రం 4:16గంటలకు హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ జడ్చర్లకు చేరుకు న్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు నాయకులతో కలసి 4:20గంటలకు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. మొదటగా ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి ప్రసగించారు. ఆతర్వాత 4:30 గం టలకు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభిం చి 4:49గంటలకు ముగించారు. 5:01గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో 9నిమి షాలపాటు కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్కు వీడ్కోలు పలికారు.
జడ్చర్లలో ప్రజాఆశీర్వాద సభ నేపథ్యంలో 700మందితో పోలీసులతో భారీ బందోబస్తు కల్పించారు. డీఐజీ, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, సభావేదిక, వీఐపీ, మీడీయా గ్యాలరీ, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు. సభ ప్రాంగణంలోకి ఒక్కొక్కరిని తనీఖీలు చేసి లోపలికి పంపించారు. సభా వేదికపై పాస్లు ఉన్న నాయకులకు మాత్రమే అనుమతించారు.
రాజాపూర్, అక్టోబర్ 18: జడ్చర్ల పట్టణంలోని బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు నియోజక వర్గంలోని జడ్చర్ల, నవాబ్పేట, రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్, ఉర్కొండ మండలాలకు చెందిన వివిధ గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంతో తరలొచ్చారు. మహిళలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాలు, బతుకమ్మలతో ఉరేగింపుగా తరలివచ్చారు. సభ ప్రాంగణంలో స్థలం సరిపోక చుట్టుపక్కల భవనాలపై కూర్చుని సీఎం కేసీఆర్ చేప్పే పథకాలను ఎంతో శ్రద్ధతో విన్నారు.
మిడ్జిల్,అక్టోబర్ 18 : జడ్చర్లలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాదం సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్దఎత్తున సభకు తరలివెళ్లారు. మండలంలోని మున్ననూర్ గ్రామం నుంచి మహిళలు బతుకమ్మలతో డ్యాన్స్లు చేస్తూ సభకు వెళ్లా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, శ్యామ్సుందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జంగిరెడ్డి, నారాయణరెడ్డి, బాలు, ప్రతాప్రెడ్డి, జైపాల్రెడ్డి, శ్రీనివాసులు,వెంకట్రెడ్డి,శేఖర్,భాస్కర్,నిరంజన్ ఉన్నారు.
అలంపూర్,అక్టోబర్18 : వర్షాభావ దృష్ట్యా అలంపూర్ ప్రాంతంలోని సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని, వాటికి సరిపడా సాగు నీరందించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభకు హాజరైన సందర్భంలో ఎమ్మెల్సీ చల్లా సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. ఆర్డీఎస్ లేదా జూరాల లింక్ ద్వారా గానీ సాగునీ రందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ నీటి విడుదల విషయమై గద్వాల ఎమ్మెల్యేబండ్లతో మాట్లాడారు. సం బంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
పదేండ్ల కిందట వ్యవసాయం చేయాలంటే భ యం వేసేది. పంటలు సరిగా పండక షావుకారు వద్ద తెచ్చిన అప్పు పెరిగి భూములు అమ్ముకొని నష్టపోయాం. ఇంక ఊర్లో బతకడం కష్టం అనుకొని బతుకుదెరువు కోసం పట్నం పోయి గోస పడ్డాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే రైతులు ఎటువంటి కష్టం లేకుండా వ్యవసాయం చేసుకుంటున్నాం. రైతు కష్టం కండ్లరా చూసిన సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎక రాకు రూ.10వేలు రెండు పంటలకు అందించడంతో చీకూచింత లేకుండా పంటలు పండిస్తున్నాం. వచ్చే పంటకు రైతు బంధు పెంచుతానని సీఎం కేసీఆర్ చెప్పాడంటే తప్పకుండా ఇస్తాడు.
-వెంకటయ్య , రైతు రుద్రారం
జడ్చర్లలో నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ను చూడాలని వచ్చాను. మా దివ్యాంగుల కోసం ఎన్నో మంచి పనులు చేశాడు. తెలంగా ణ రాకముందు దివ్యాంగుల పింఛన్ రూ. 500లే.. అవికూడా ఎప్పుడు వచ్చేవో తెలిసేది కాదు. ఆఫీసుల చూట్టు తిరగాల్సి వచ్చేది. సీ ఎం కేసీఆర్ మాకు ఇచ్చే పింఛన్ రూ.4016 నుంచి రూ.5016 పెంచుతున్నట్లు మ్యానిఫెస్టోలో పెట్టడంతో మాకిక ఢోకాలేదు. పింఛన్ కాకుండా స్వయం ఉపాధి కోసం 50శాతం సబ్సిడీ రుణాలతోపాటు వాహనాలు కొనుగోలుకు 30 శాతం సబ్సిడీ ఇచ్చిండు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్కు భారీ మెజార్టీ వస్తుంది.
-యాదయ్య దివ్యాంగుడు, మిడ్జిల్
అవిటితనంతో ఏపనీ చేయలేక ఇంటి వద్ద మనసు చంపుకోని బతుకుతున్నా.. దివ్యాంగులకు పింఛన్ అందించి వారికి ఆరాధ్యుడయ్యాడు. సీఎం కేసీఆర్ లేకుం టే దివ్యాంగులు జీవచ్చవంలా బతికేవా ళ్లం. ప్రతి నెలా రూ.3వేల పింఛన్ అందించడమే కాకుండా ఎన్నికల తర్వాత రూ.5వేలు అందిస్తానని హామీ ఇచ్చాడు. దివ్యాంగులకు ఇంతకన్నా ఏమి కావాలి.
-బిచ్చునాయక్, దివ్యాంగుడు, శంకరాయపల్లి తండా, జడ్చర్ల