భూత్పూర్, మార్చి 9 : తెలంగాణ ఏర్పాటుకు చేసి న పోరాటం, ముఖ్యమంత్రిగా రాష్ర్టాభివృద్ధికి కేసీఆర్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అన్నాసాగర్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో శనివారం సమావేశమై మాట్లాడారు. రేవంత్రెడ్డి ఇచ్చిన హామీల్లో రైతుబంధు, రుణమాఫీ ఇంతవరకు అమలు చేయలేకపోయాడన్నారు. నియోజకవర్గంలో దాదా పు 85శాతం ఎంపీటీసీలు, 100 శాతం జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు గులాబీ పార్టీ వాళ్లే ఉన్నారని, వీరంతా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని సూచించా రు. ఈ ఐదేండ్ల కాలంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల ను ఎప్పటికప్పుడు ఎండగడుతామన్నారు. 11న జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్స్లో పార్లమెంట్స్థాయి స మావేశం ఉంటుందని, నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని కోరారు. సమావేశంలో జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీలు శేఖర్రెడ్డి, మౌనిక, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు ఇంద్రయ్యసాగర్, అన్నపూర్ణ, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, పార్టీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనర్సింహయాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.