మాగనూర్, నవంబర్ 2: సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కుమారుడు చిట్టెం చాణిక్యారెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి అధ్వర్యంలో మం డలంలోని వర్కుర్, నేరడగం, నేరడగం దొడ్డి గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెరడగం దొడ్డి గ్రామ సమీపంలోని పొలాల్లో పని చేస్తున్న రైతు కూలీలను కలిసి సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో చేసిన అభివృద్ధి, మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి వివరించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో అమలౌతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఓట్ల కోసం మాయ మాటలు చెప్పే మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలని ప్రజలకు సూచించాలని తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని ఇంటింటికీ చేరవేస్తూ చిట్టెం రామ్మన్న గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుదు అశోక్ గౌడ్, మాగనూర్ ఉమ్మడి మండల ఎన్నికల ఇన్చార్జి లక్ష్మీకాంత్ గౌడ్, సర్పంచులు , రైతు బంధు సమితి సభ్యులు మధుసూదన్ రెడ్డి, మల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరచింత, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మక్తల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి గుర్తించి కారుగుర్తుకు ఓటేయాలని జెడ్పీటీసీ మార్క సరోజ, పాంరెడ్డిపల్లి సర్పంచ్ బండి పావని, బీఆర్ఎస్ నాయకులు మోహన్రెడ్డి, వెంకట్రెడ్డి, వెంకటయ్య కోరారు. గురువారం మండలంలోని పాంరెడ్డిపల్లి గ్రామంలో వారు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రభాకర్, ఉప్పసర్పంచ్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మక్తల్ అర్బన్, నవంబర్ 2: పట్టణంలోని వివిధ వార్డుల్లో గురువారం బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.నర్సింహాగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆరు గ్యారెంటీలు అమలే కావడం లేదని ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధిని చూసి కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ వాసులు తమను తెలంగాణలో కలపాలని అంటున్నారన్నారు. వ్యవసా యానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభల్లో అంటున్నారని అలాంటి వారు ఆరు గ్యారెంటీలను ప్రకటించడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్తూ కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్వేతావిష్ణువర్దన్ రెడ్డి, మొగులప్ప, జగ్గలి రాములు, బీఆర్ఎస్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మజర్, మహిళా విభాగం టౌన్ అధ్యక్షురాలు రాధిక, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.