జడ్చర్లటౌన్, మార్చి 1 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.