మహబూబ్నగర్ అర్బన్, ఫిబ్రవరి 13: కృష్ణా జలాలు తెలంగాణ హక్కు అని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున చలో నల్లగొండ కేసీఆర్ సభకు తరలివెళ్లారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం కృష్ణానది జలాలను కేఆర్ఎంబీకి అప్పగించడంతో మహబూబ్నగర్ జిల్లా కరువుకు నిలయంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రానికి తా కట్టు పెట్ట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహబూబ్నగర్ ఎంతో పచ్చబడిందని, కాంగ్రెస్ ప్ర భుత్వం తిరిగి జిల్లాను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ కుట్ర చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, గణేశ్, వెంకన్న, బాలరాజు, ఆంజనేయులు, రవికిషన్రెడ్డి, శ్రీనివాసులు, కృష్ణమోహన్ పాల్గ్గొన్నారు.
రాజాపూర్, ఫిబ్రవరి 13: నల్లగొండలో బీ ఆర్ఎస్ బహిరంగ సభకు మంగళవారం మం డలంలోని బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్ల్లారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, ఏఎంసీ వైస్చైర్మన్ నారాయణరెడ్డి, డైరెక్టర్ తిరుపతయ్య, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు యాదగిరి, విజయ్కుమార్, నజీమ్, శ్రీశైలం, నవీన్, మైపాల్, రాములు వెళ్ల్లారు.
దేవరకద్ర, ఫిబ్రవరి 13 : బీఆర్ఎస్ అధినే త కేసీఆర్ నాయకత్వంలో నల్లగొండలో నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు డోకూర్ నరేందర్రెడ్డి శ్రీకాంత్ యా దవ్, కర్ణం రాజు, కుర్వ రాందాస్, రవీందర్రెడ్డి, దొబ్బలి ఆంజనేయులు, గోపాల్, మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
మద్దూర్ (కొత్తపల్లి), ఫిబ్రవరి 13 : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు నల్లగొండలో నిర్వహించిన చలో నల్లగొండ సభకు మద్దూర్, కొత్తపల్లి మండలాల నుంచి బీఆర్ఎ స్ నాయకులు భారీగా తరలివెళ్లారు.
మూసాపేట, ఫిబ్రవరి 13 : కృష్ణా జలాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అడ్డాకుల మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్త లు, రైతులు పెద్ద సంఖ్యలో నల్లగొండ జిల్లా మర్రిగూడ సమీపంలో నిర్వహించే జల సాధన ఉద్యమ సభకు తరలివెళ్లారు. అలాగే మూసాపేట మండలంలోని ఆయా గ్రామాల నుంచి నాయకులు, రైతులు నల్లగొండకు తెరలివెళ్లా రు. కార్యక్రమంలో అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, మండలాధ్యక్షుడు తోకల శ్రీనివాస్రె డ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, జెడ్పీటీ సీ ఇంద్రయ్యసాగర్, మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఫిబ్రవరి 13 : ఉమ్మడి మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు నల్లగొండ బహిరంగ సభకు భారీగా తరలివెళ్లారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదేశానుసారం గండీడ్, మహ్మదాబాద్ మండలాల నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యానాయక్, బిక్షపతి ఆధ్వర్యంలో బస్సుల్లో, ఇతర వాహనాల్లో వెళ్లారు. జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ జెండా ఊపడంతో వాహనాలు బయలుదేరి వెళ్లాయి. కార్యక్రమంలో పీఏసీసీఎస్ డైరెక్టర్ జంగళ్ల వెంకటయ్య, మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్రెడ్డి, ఆయా గ్రామాల సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మరికల్, ఫిబ్రవరి 13 : నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్రెడ్డి ఆధ్వర్యంలో మం డలంలోని బీఆర్ఎస్ నాయకులు, రైతులు, ప్రజలు నల్లగొండకు తరలివెళ్లారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతయ్య, రాజేశ్, రైతులు ఉన్నారు.
నవాబ్పేట, ఫిబ్రవరి 13 : నవాబ్పేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నా యకులు భారీగా తరలివెళ్లారు. వారిలో ఎంపీ పీ అనంతయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోశ్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, మాజీ ఎంపీపీ శీన య్య, నాయకులు మధుసూదన్రెడ్డి, చెన్న య్య, అబ్దుల్లా, గోపాల్గౌడ్, యాదయ్యయాదవ్, భూపాల్రెడ్డి, లక్ష్మయ్య, శ్రీను, సంజీవరెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కృష్ణగౌడ్, హ న్మంతు, రవి పాల్గొన్నారు.
ధన్వాడ, ఫిబ్రవరి 13 : మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామల నుంచి బీఆర్ఎస్ నాయకులు బస్సుల్లో మంగళవారం నల్లగొండకు బయలుదేరి వెళ్లారు. నల్లగొండకు వెళ్లిన వారి లో నాయకులు చంద్రశేఖర్, మల్లేశ్గౌడ్, బాలరాజు, రవి, బాలప్ప, తిమ్మయ్య, భావని, సచి న్, శ్రీనివాసులు ఉన్నారు.
భూత్పూర్, ఫిబ్రవరి 13 : కృష్ణానది నీళ్లల్లో మా వాటను వదలమని ఎంపీపీ కదిరె శేఖర్రె డ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లాలో కేసీఆర్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు మండలం నుంచి పార్టీ నాయకు లు, రైతులు తరలివెళ్లారు. కార్యక్రమంలో ము న్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, గోప్లాపూర్ అశోక్గౌడ్, అజీజ్ పాల్గొన్నారు.
ఊట్కూర్, ఫిబ్రవరి 13 : బీఆర్ఎస్ అధినే త కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన నల్లగొండ మహాసభకు మండలంలోని వివి ధ గ్రామాల నుంచి మంగళవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. మక్తల్ మాజీ ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లిన ట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎ స్ బిజ్వార్ గ్రామ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్గౌడ్, హన్మిరెడ్డి, రామలింగంగౌడ్, సాయిలు, ఆశప్ప, నాయకులు రవీందర్రెడ్డి, మహేశ్ పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 13 : నల్లగొండ బహిరంగ సభకు జడ్చర్లకు చెందిన బీఆర్ఎస్ నా యకులు తరలివెళ్లారు. మంగళవారం జడ్చర్లలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రత్యేక బస్సు లో బయలుదేరి వెళ్లారు. జెడ్పీవైస్ చైర్మన్ యా దయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిట్టల మురళి, నాయకులు పాల్గొన్నారు.
కోయిలకొండ, ఫిబ్రవరి 13 : నల్లగొండ బ హిరంగ సభకు మండలం నుంచి మాజీ ఎమ్మె ల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు బస్సులు, ఇతర వాహనాల్లో తరలివెళ్లారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు తరలివెళ్లారు.
మక్తల్ టౌన్, ఫిబ్రవరి 13 : నల్లగొండ సభ కు మక్తల్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్య లో కార్యకర్తలు తరలివెళ్లారు. మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.