వనపర్తి, మార్చి 21 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పక బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి విజయం సాధిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ మంత్రి క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు తప్పక బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన స్థానిక సంస్థల అభ్యర్థి నవీన్కుమార్రెడ్డిని గెలిపిస్తారని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్దే విజయం అన్నారు. ఈ క్యాంపునకు కొంతమంది ప్రజాప్రతినిధులు తమ సొంత పనులు, అనారోగ్య సమస్యల వల్ల ప్రస్తుతం రాలేకపోతున్నారు. కానీ మరో రెండు రోజుల్లో వారు కూడా క్యాంపులో జాయిన్ కానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలోని ఏ ప్రజాప్రతినిధి అంసతృప్తిలో లేరని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా పునఃనిర్మాణం చేపట్టిన పలు ఆలయాల పనులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాలకు సంబంధించిన స్థలం కొల్పోవడం జరిగింది, అందులో భాగంగా ఆలయాల నిర్మాణాలకు తాను సొంతంగా రూ.5 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. వీరాంజనేయస్వామి, కాళీమాత ఆలయాల నిర్మాణానికి తనవంతు మరింత సహకారం అందిస్తానని, వీటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఆయన కాళీమాత, వీరాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు నీలస్వామి, ఎర్రశీను, బాలస్వామి, రామస్వామి, రవి తదితరులు ఉన్నారు.