నారాయణపేట, ఫిబ్రవరి 2 : తెలంగాణలో ఎవరూ కంటి సమస్యలతో బాధపడరాదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రెండో విడుత కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని బాహర్పేట ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కంటివెలుగు వైద్య శిబిరాన్ని కలెక్టర్ శ్రీహర్షతో కలిసి సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకొని దగ్గరి చూపు అద్దాలను అక్కడికక్కడే పొందాలని పేర్కొన్నారు. దూరపు చూపు అద్దాల కోసం ఆన్లైన్లో న మోదు చేస్తే 15 రోజుల్లో వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చే సిందన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని కంటి సమస్యలు దూరం చేసుకోవాలన్నారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారికి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్ట ల్, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, ఫిబ్రవరి 2 : మండలంలోని వేంకటేశ్వరకాలనీలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని గురువారం ఎంపీపీ బక్క నర్సప్ప పరిశీలించారు. ఈ సందర్భం గా 126మందికి పరీక్షలు చేయగా 20మందికి రీడింగ్ అద్దా లు అందజేసినట్లు వైద్యుడు ఐశ్వర్య తెలిపారు. మరో 28 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు వారు పేర్కొన్నా రు. కార్యక్రమంలో నాయకుడు వెంకట్రాములు, ఆశ కార్యకర్త లు, వృద్ధులు, మహిళలు పాల్గొన్నారు.
మరికల్ (ధన్వాడ), ఫిబ్రవరి 2 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. మరికల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరంలో గురువా రం 112మందికి పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చినట్లు వైద్యుడు రామకృష్ణారెడ్డి తెలిపారు. 20మందికి అవసరమైన అద్దాల కోసం ఆర్డర్ పెట్టగా 12మందిని ఆపరేషన్ కోసం రెఫర్ చేసిట్లు వైద్యులు పేర్కొన్నారు.
నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 2 : మండలంలోని కోటకొండ, అప్పక్పల్లి గ్రామాల్లో గురువారం కంటివెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. కోటకొండలో 127 మంది, అప్పక్పల్లిలో 145 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అ వసరమైన వారికి అద్దాలను అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు అర్చన, శ్రీవిద్య, నందిని, శిబిరం కో ఆర్డినేటర్ అశోక్రాజ్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మాగనూర్, ఫిబ్రవరి 2 : మండలంలో గురువారం కొ నసాగుతున్న కంటివెలుగు కార్యక్రమంలో 135 మందికి కంటి పరీక్షలు నిర్వహించిట్లు డాక్టర్ రాఘవేంద్రరెడ్డి తెలిపారు. అందులో 35 మందికి అంధత్వ లక్షణాలను గుర్తిం చి కంటి పరీక్షలు చేసి 12 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 14 మందికి మెరుగైన అద్దాల కోసం ఆర్డర్ చేశామన్నారు. 9 మందికి శస్త్ర చిక్సిత కోసం రెఫర్ చేశామని డాక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.
కోస్గి, ఫిబ్రవరి 2 : లయన్స్ క్లబ్ కోస్గి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 72 మందికి పరీక్షలు నిర్వహించి 20 మందికి ఆపరేషన్ కోసం రెఫర్ చేసినట్లు డాక్టర్ భాస్కర్గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు వెంకట్రాములు, పూర్ణచందర్యాదవ్, వైద్యులు, గ్రామస్తు లు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, ఫిబ్రవరి 2 : చక్కటి కంటి చూపు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం మండలంలో గరువారం సాగుతున్నది. మండలంలోని గుడిగండ్ల పల్లె దవాఖాన, మంథన్గౌడ్ గ్రామ పంచాయతీ, మక్తల్ 8వ వార్డులో కంటివెలుగు శిబిరాలను ఏ ర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మక్తల్ 8వ వార్డులో 160మందికి, గుడిగండ్ల పల్లె దవాఖానలో 130 మందికి, మంథన్గౌడ్లో 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని డాక్టర్ తిరుపతి తెలిపారు. మక్తల్ 8వ వా ర్డులో సాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునస్వామి పరిశీలించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ, ఫిబ్రవరి 2 : కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ్ కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని హిదూపూర్లో గురువారం నిర్వ హించిన కంటివెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలను అందజేశారు. కార్యక్రమం లో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.