మహబూబ్నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉపాధి హామీ పథకంపై కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్లోని ఐదు జిల్లా కేంద్రాల్లో జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని మంత్రులు, ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కోరారు. ధర్నాకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలన్నారు.
ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్రం తెలంగాణపై కావాలని వివక్ష చూపుతున్నదని, ఇందుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు గళం విప్పాలన్నారు. కల్లాల విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. కల్లాల నిర్మాణానికి అవసరమైన రూ.151 కోట్లను తిరిగి ఇవ్వాలని కేంద్రం నోటీసులు పంపడం దారుణమన్నారు.