జడ్చర్లటౌన్, నవంబర్ 14 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ ప్రచారం విస్త్రతగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడపగడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వస్పందన లభిస్తున్నది. కారు గుర్తుకే ఓటేసి మరొసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ప్రజలు భరోసానిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో కౌన్సిలర్ లత ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే 6వ వార్డులో కౌన్సిలర్ రమేశ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. 22వ వార్డులో కౌన్సిలర్ శ్రీశైలమ్మ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మరొసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రవిశంకర్, మురళి, రహమాన్, రేణుక, లక్ష్మయ్య, శ్రీను, అనసూయ, పార్వతమ్మ, పాల్గొన్నారు.
జడ్చర్ల, నవంబర్ 14 : జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి, స్టేషన్తండా, మర్రిచెట్టుతండా, బూర్గుపల్లి, కిష్టారం, పెద్దతండా, చర్లపల్లి, మాచారం తదితర గ్రామాల్లో మంగళవారం సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ జడ్చర్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత లక్ష్మారెడ్డిది అన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, లక్ష్మారెడ్డిని మరోమారు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాలలో సర్పంచులు ప్రణిల్చందర్, రవీందర్రెడ్డి, కృష్ణకుమార్, రామకృష్ణారెడ్డి, రవిరాథోడ్, ముడా డైరెక్టర్ ఇంతియాజ్ఖాన్, గోపాల్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
బాలానగర్, నవంబర్ 14 : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం ఇంటింటికీ తిరిగి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేతిరెడ్డిపల్లిలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ రాంరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు నర్సింహులు, గణేశ్గౌడ్, నాగేందర్నాయక్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మిడ్జిల్, నవంబర్ 14 : తండ్రి గెలుపులో నేను సైతం అంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తనయుడు స్వరణ్రెడ్డి మిడ్జిల్ మండలంలో మంగళవారం లక్ష్మారెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలకేంద్రంతోపాటు రాణిపేట్, కొత్తపల్లి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించాడు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ, బాలు, నిరంజన్, బంగారు, బీమ్రాజ్, రాజు, అంజి, ప్రసాద్, నవీన్చారి, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్/రాజాపూర్/నవాబ్పేట, నవంబర్ 14 : బాలల దినోత్సవం సందర్భంగా సంస్కారభారతి ఆధ్వర్యంలో మంగళవారం జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అలాగే జనతా సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో పాతబజార్ ఎర్రసత్యం ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పలకలు, బలపాలను పంపిణీ చేశారు. అలాగే రాజాపూర్ మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం బాలాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలు అనంద ఉత్సవాలతో అటపాటలతో గడిపారు. పాఠశాలలో అటల పోటీలు, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నవాబ్పేట మండల కేంద్రంలోని చాణక్య పాఠశాలతోపాటు ఇప్పటూర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగానే విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంస్కారభారతి సభ్యు లు గోనెల రాధాకృష్ణ, ఉపాధ్యాయులు, జనతా సోషల్ సర్వీస్ సంస్థ సభ్యులు, హెచ్ఎం సంధ్యారాణి, అజీజ్, రవికుమార్, రోజారాణి, పాఠశాల డైరెక్టర్లు సునీల్, సందీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.