పెద్దమందడి, మార్చి 20: మండలంలోని వెల్టూరులో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. కార్యక్రమానికి దాదాపు 5వేల మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో మనిగిల్ల, పామిరెడ్డిపల్లి తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తలు వందమంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ రవీందర్రావు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, అడ్డాకల్ జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాశ్రెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, వైస్ఎంపీపీ రఘుప్రసాద్, సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఆధ్వర్యంలో..
మహ్మదాబాద్, మార్చి 20: అభివృద్ధికి ఆకర్శితులై పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కంచన్పల్లికి చెందిన బొజ్జ సురేంద్రరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుఎత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో కంచన్పల్లి సర్పంచ్ అంజిలయ్య. నాయకులు సురేశ్నాయక్, రమేశ్రెడ్డి, అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గట్టు మండలంలో..
గట్టు, మార్చి 20: మండలంలోని లింగాపురం సర్పంచ్ సూర్యగౌడ్ బీఆర్ఎస్లో చేరారు. సోమవారం మిట్టదొడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ సూర్యగౌడ్ బీఆర్ఎస్లో చేరడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ బాసు శ్యామల, పీఏసీసీఎస్ అధ్యక్షుడు క్యామ వెంకటేశ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బాసు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.