మల్దకల్, ఏప్రిల్ 3 : మొక్కజొన్న కోత మిషన్లో పడి బాలుడు మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా.. మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి నాగన్న, అఖిల కుమారుడు రాజు అలియాజ్ జీవన్(6). నాగన్న తన పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను కోత కోయించేందుకు అల్లపాడుకు చెందిన సుభాష్ హార్వెస్టర్ యంత్రాన్ని అద్దెకు మాట్లాడారు.
గురువారం మిషన్ పొలంలో పంటను కోసే క్రమంలో చేనులో ఆడుకుంటూ రాజు ఉండగా.. గమనించని హార్వెస్టర్ డ్రైవర్ అతడి వైపు వెళ్లగా మిషన్ ఆపిల్లోకి బాలుడిని లాగేసుకున్నది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే మిషన్ను ఆపివేయించగా.. తల భాగం కట్ కాగా మిగతా శరీరం ముద్దగా మారింది. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు సమాచారం అందుకొని ఎస్సై నందికర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అందజేశారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.