గండీడ్, డిసెంబర్ 11 : మండలంలోని రంగారెడ్డిపల్లిలో ఆదివారం బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బొడ్రాయి, నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని సూచించారు. బొడ్రాయి, నాగదేవత విగ్రహ ప్రతిష్ఠాపనతో రంగారెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. గ్రామస్తు లు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్, మాజీ సర్పంచ్ రాములు, వెంకటయ్య, గోపాల్రెడ్డి, బాలవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గండీడ్, డిసెంబర్ 11 : మండలంలోని పెద్దవార్వాల్కు చెందిన కాశీనాథ్రెడ్డి ఇటీవల ప్రమాదానికి గురై గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఆదివారం పెద్దవార్వల్కు వెళ్లి కాశీనాథ్రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి మంజూరుకు కృషి చేస్తానని, అందుకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన వెంటనే సమాచారం ఇస్తే వైద్యఖర్చులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ ఉప్పరి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు రాంచంద్రారెడ్డి, గోపాల్రెడ్డి, పెంట్యానాయక్, కావలి కృష్ణయ్య పాల్గొన్నారు.