జడ్చర్లటౌన్, ఫిబ్రవరి21 : మంత్రాలు చేసి మీ క ష్టాలు తొలగిస్తానని న మ్మబలికి అమాయక మ హిళలను టార్గెట్ చేసి వా రి అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ మోసగాడి లీలలు ఆలస్యంగా వెలుగులోకి వ చ్చాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం జడ్చర్ల పట్టణంలోని పాతబజార్లో నివాసం ఏర్పరుచుకున్న జైనులాబోద్దీన్ కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ మంత్రాలు, తంత్రాలు చేస్తానంటూ మీకు ఎక్కువ డబ్బులు రావాలంటే నేను చెప్పినంటూ చేయాలని నమ్మబలికి వారి న్యూడ్ఫొటోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 18న రాత్రి అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇంటికెళ్లిన మోసగాడు సదరు మహిళ తలపై చేయిపెట్టి మంత్రిస్తున్నట్లు నటించి ఆ మహిళకు సంబంధించిన న్యూడ్ ఫొటోలు తీశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు ఇతరులకు పంపిస్తానని బెదిరించాడు. ఎవరికైనా తెలిస్తే పరువుపోతుందని భయంతో సదరు మహిళ మిన్నకుండిపోయింది. మోసగాడి బ్లాక్మెయిల్ను తట్టుకోలేక చివరకు బాధితురాలు ధైర్యం చేసుకొని జడ్చర్ల పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు సోమవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ఎవరెవరి పాత్ర ఉందన్న విషయం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.