ఊట్కూర్, జూలై 31 : రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే వారు టీఆర్ఎస్లో చేరుతున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరుకు చెందిన 30మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే చిట్టెం సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికే ఆదర్శనీయన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు చేరడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ నా యకులు కూతలి హన్మంతు, శాసన్పల్లి రవి, నర్సింహులు, కిష్టయ్య, మాల తిమ్మప్ప, యాసీన్, హుసేన్, కతాల్ ఉన్నారు. కార్యక్రమంలో స మృద్ధికుమార్, ఉప సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.