భూత్పూర్, ఏప్రిల్ 4: ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అధికార దాహం కోసం బీజేపీ ఆరాట పడుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్ల 83లక్షలు మంజూరైన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్ ఇంట్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో ప్రజాసమస్యలను విస్మరించి అధికారం కోసం ఆరాటపడుతున్నదన్నారు. 2014లో పీఎం మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పిన హామీ ఏమైందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో తండాలను జీపీలుగా మార్చుకున్నామన్నారు. ప్రతి తండాకు బీటీరోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గవ్యాప్తంగా కొత్తగా రూ.55 కోట్లతో 1,100 డబుల్ ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులే కోర్టులో కేసులు వేశారని దుయ్యబట్టారు. రోడ్ల మంజూరుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మత్స్య సహకారసంఘం జిల్లా ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, సర్పంచ్ శ్రీనూనాయక్, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, రామునాయక్, అజీజ్, శంకర్నాయక్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.