పెబ్బేరు, జూన్ 25: మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గుమ్మడం, పాతపల్లి, రంగాపురం, చెలిమిల్ల గ్రామాలకు చెందిన వీరికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు సాయినాథ్, గోపిబాబు, పెద్దిగారి స్వామి, రాముడు, మన్యం, వెంకటస్వామి, బీసన్న, సిద్ధార్థ, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.