మరికల్, ఫిబ్రవరి 19 : మరికల్లో సోమవారం బీరప్ప బండారు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా కురుమ యాదవులు ఉదయం నుంచే బీరప్ప ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి ఒకరిపై ఒకరు బండారు చల్లుకొన్నారు. ఈ ఉత్సవాలకు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన బీరప్ప ఆలయంలో ప్ర త్యేక పూజలు నిర్వహించగా కురుమ యాదవులు ఆయనను పూలమాల, శాలువా, గొంగడితో సన్మానించారు. అదే వి ధంగా తీలేరులోనూ కురుమయాదవులు బీరప్ప ఉత్సవాలను నిర్వహించారు. బుధవారం ఎల్లమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్చైర్మన్ గౌని సురేఖారెడ్డి, మాజీ సర్పం చ్ కస్పె గోవర్ధన్, నాయకులు తిరుపతయ్య, శ్రీనివాసులు, రాజేశ్, మతీన్, కృష్ణయ్య పాల్గొన్నారు.
మరికల్ మండలంలోని మద్వార్ గ్రామంలో మాతామాణికేశ్వరీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ధన్వాడ సింగిల్విండో చైర్మన్ వెంకట్రాంరెడ్డి, నాయకులు నాగేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ పుణ్యశీల, రాజులయ్యతోపాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.