భూత్పూర్: ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి జన్మదినాన్ని పురష్కరించుకొని హైద్రాబాద్ మలక్పేట యశోధా దవాఖాన ఆధ్వర్యంలో డాక్టర్ సురేందర్రెడ్డి నేతృత్వంలో మండలం అన్నాసాగర్ లో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. అదేవిధంగా జిల్లా దవాఖాన, రెడ్క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. హెల్త్ క్యాంపులో దాదాపు 1000 మందికి పైగా పరీక్షలను నిర్వహించి, మందులను ఉచితంగా పంపిణీ చేసినట్లు సురేందర్రెడ్డి తెలిపారు.
రక్తదాన శిబిరంలో 250మందికి పైగా రక్తం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సాయంత్రం ఎమ్మెల్యే వైద్య బృందాన్ని సన్మానించారు. రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాలు విజయవంతం కావడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్గౌడ్, జడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీలు కదిరెశేఖర్రెడ్డి, రమాశ్రీకాంత్, హర్షవర్ధన్ రెడ్డి, మౌనిక, చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, కో ఆప్షన్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.