వనపర్తి, మే 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు హ త్యలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ప్రాంతం హత్య లు, రాజకీయాలకు కేరాఫ్గా మారుతున్నదన్నారు. గు రువారం లక్ష్మీపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బీరంహర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్రెడ్డితోపాటు నాయకులు క్రిశాంక్, అభిలాష్రావుతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎ న్నికల్లో పనిచేయని వారిని, అధికార పార్టీకి మద్దతుగా పనిచేయని వారిపై కక్షపూరితంగా దాడులు, హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలోనూ పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాములలో మొదటి హత్యకు పాల్పడ్డారన్నారు. ఇప్పుడు చిన్నంబావి మండలం ల క్ష్మీపల్లి శ్రీధర్రెడ్డిని హత్య చేయించి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని కేటీఆర్ విమర్శించారు.
వరుసగా జరుగుతున్న ఈ హత్యలకు మంత్రి జూపల్లి బాధ్యత వహించాలన్నారు. ఈ నియోజకవర్గంలో మరో ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. 80 ఏండ్లకు పైబడిన శేఖర్రెడ్డి పోలీసుల కు ఇచ్చిన ఫిర్యాదులో తన కొడుకు హత్యలో మంత్రి జూపల్లి ప్రమేయం ఉన్నదని పేర్కొనడంతో పోలీసులు ఒ త్తిడి చేస్తున్నారని చెప్పడం చూస్తే బాధ కలుగుతున్నదన్నారు. దాడులు, హత్యలకు పాల్పడుతున్న అధికారపార్టీ నాయకులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హిత వు పలికారు. లేదంటే మా కార్యకర్తలను నిలువరించ డం కష్టంగా మారుతుందని హెచ్చరించారు. తాము ప దేండ్లపాటు పసిడి పంటలు, ప్రశాంతంగా ప్రజల జీవనం ఉండేలా పాలన అందిస్తే.. ఐదు నెలల్లోనే అనేక హత్యలకు తెరలేపి పల్లెల్లో ప్రశాంతతను లేకుండా అధికార కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదన్నారు. సీఎం రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే జరుగుతున్న హత్యలపై ప్రత్యేక జుడీషియల్ టీంను వేసి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి బాసటగా నిలుస్తామని, శ్రీధర్రెడ్డి తల్లిదండ్రులు శేఖర్రెడ్డి, యశోదమ్మకు ధైర్యం చెప్పారు.