ఊట్కూర్, మే 2 : అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసే ‘బాలామృతం’ చిన్నారుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తోంది. పిల్లలు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం ఉంటుంది. ఈ కారణంగా వారిలో పోషకాల లోపాన్ని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం పంపిణీ చేస్తున్నారు. కాల్షియం, విటన్ ఏ, బీ కాంప్లెక్స్లకు అదనంగా అయోడిన్ ఉప్పు కలిపిన గోధుమపిండి, శనగపప్పు, నూనెలు, పంచదారతో పోషకాలను చేర్చి బాలామృతాన్ని తయారుచేస్తారు. సమగ్రశిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ఆధ్వర్యంలో ఏడునెలల నుంచి మూడేండ్లలోపు పిల్లలకు బాలామృతాన్ని ఉచితంగా అందజేస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో నెలకోసారి దీనిని పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా వీరికి నెలకు 16 గుడ్లు పంపిణీ చేస్తున్నారు. బరువు తక్కువగా ఉండి లోపపోషణతో బాధపడుతున్న పిల్లలకు నెలలో 25 గుడ్లు పంపిణీ చేస్తారు. జిల్లాలోని నారాయణపేట, మద్దూర్, మక్తల్ ప్రాజెక్టు పరిధిలో 55 మినీ, 649 మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు నెలల నుంచి ఏడాది పిల్లలు 4,754 మంది, ఏడాది నుంచి మూడేండ్ల వరకు 16,550 మంది, మూడు నుంచి ఆరేండ్లలోపు 16,628మంది చిన్నారులు ఉన్నారు. గర్భిణులు 5,277 మంది, బాలింతలు 5,408మంది ఉన్నారు. చిన్నారులకు ప్రతిరోజూ అంగన్వాడీల్లో పోషకాహారాన్ని అందిస్తున్నారు.
విస్తృతంగా ప్రచారం..
పోషక విలువలు ఉన్న బా లామృతంపై ప్రభుత్వం వి స్తృతంగా ప్రచారం చేస్తోం ది. అంగన్వాడీల్లో ఇస్తున్న ఈ అదనపు ఆహారాన్ని పి ల్లలకు ఎలా తినిపించా లి? దీని వల్ల కలిగే ప్ర యోజనాలను వారి తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వివరిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ఈ పౌడర్ను పాలల్లో కలిపి తినిపిస్తుండగా.. మరికొందరు వేడి నీటిలో కలిపి తినిపిస్తున్నారు. పోషకాల లోపంతో పిల్లల్లో కంటిచూపు మందగించడం, పెదవులు పలగడం, నరాల బలహీనత, చర్మవ్యాధులు వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటివి భవిష్యత్లో రాకుండా బాలామృతం ఔషధంగా పనిచేస్తుంది. బాలామృతాన్ని రోజుకు వందగ్రాముల చొప్పున 4-5 సార్లు పిల్లలకు తినిపించాలి. ఒకేసారి వంద గ్రాములకు మించి తినిపించకూడదు. గిన్నెలు, చేతులు శుభ్రంగా ఉంచి ఈగలు వాలకుండా చూడాలి. లేదంటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.
పిల్లలకు బాలామృతం తప్పనిసరి
బాలామృతం చిన్నారులకు ఎంతో విలువైన పౌష్టికాహారం. పిల్లల ఎదుగుదలతోపాటు మేధాశక్తి పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. చిన్నారులకు ప్రస్తుతం అందిస్తున్న బాలామృతం స్థానంలోనే బాలామృతం ప్లస్ను కూడా అందిస్తున్నాం. 0-5 ఏండ్ల పిల్లల్లో ఆకలి మందగించడం, సన్నగిల్లడం, కుంగిపోయినట్టు ఉండటం, మరుగుజ్జులుగా ఉండటం, తినగానే విసర్జన కావటం, అదేపనిగా విరేచనాలు కావటం, ఎత్తుకు తగ్గ బరువు, పొడవులో వ్యత్యాసం వంటి లక్షాణాలను గుర్తించి బాలామృతం ప్లస్ అందిస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్న బాలామృతం, బాలామృతం ప్లస్ను వృథా చేయొద్దు.. ఇది వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.