ఊట్కూర్, సెప్టెంబర్ 8: మడలంలోని బిజ్వారం, ఎర్గట్పల్లి గ్రామాల్లో ని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం పోషణ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బిజ్వారం జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రమ్మ, ఐసీడీఎస్ సూపర్వైజర్ గీత పాల్గొని మాట్లాడుతూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని , చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పిల్లల ఎదుగుదల, శారీరక, మాన సిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. ఎర్గట్పల్లి లో అంగన్వాడీ టీచర్ సావిత్రిబాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో ప్రధానో పాధ్యాయులు ధనుంజయ, బన్నేశ్, పంచాయతీ కార్యదర్శి మంజుల, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మరికల్, సెప్టెంబర్ 8 : ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలద్వారా అందిస్త్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీ గోపాల్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతకు అందిస్తున్న పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. అలాగే మండల కేం ద్రంలోని ఆన్ని ఆంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అగన్వాడీ టీచర్లు చంద్రకళ, భారతమ్మ, బాలమణి, సుమిత్ర, పుష్ప, లక్ష్మీదేవి, హై మావతి, శైలజ, బాలమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్వలో…
నర్వ, సెప్టెంబర్ 8: పోషకాహారంతోనే సంపూర్ణ ఆర్యో గ్యం సాధ్యమని మండలంలోని ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ చెన్నయ్య అన్నా రు. శుక్రవారం గ్రామంలోని ఆంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన మాసోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ. ఎదిగే పిల్లలకు తప్పనిసరిగా పోష కాహారం అందించాలన్నారు. వీటి ద్వారా ఆరోగ్యంతో పాటు ఎదు గుదల ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీసీ సూప ర్వైజర్ అరుణ, ఉప సర్పంచ్ నాగరాజు, ఆంగన్వాడీ టీచర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.