పాలమూరు, సెప్టెంబర్ 5 : సమాజంలో మంచి నడవడికను నేర్పేది గురువేనని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి బాధ్యత తీసుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దేది గురువులేనన్నారు. టీచర్లు ఏ సమస్యనైనా ఎదుర్కోగలరని, ఎంతోమంది రిటైర్డ్ టీచర్లు సమా జం హితం, అభివృద్ధి కోసం సామాజిక కార్యక్రమాలు చే స్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతామన్నారు. ఉపాధ్యాయు లు మరింత బాధ్యతగా పనిచేసి జిల్లాను మరింత ముం దుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు. అనంత రం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 55మందిని శా లువాతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం లో కలెక్టర్ రవినాయక్, రెవెన్యూ అడిషినల్ కలెక్టర్ మోహన్రావు, ఆర్డీవో అనిల్కుమార్, డీఈవో రవీందర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 5 : కష్టపడి పనిచేసే కార్యకర్తలు పార్టీకి పట్టుగొమ్మల్లాంటి వారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మహబూబ్నగర్ పట్టణ కౌన్సిలర్ నర్సింహులు ఆధ్వర్యంలో 32, 34 వార్డులకు చెందిన బీజెపీ వార్డు అధ్యక్షులు శ్రీనివాస్, రవితోపాటు 50మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు శివరాజ్, శ్రీనివాస్యాదవ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 5 : పచ్చని పట్టణంగా పాలమూరును తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ఐదేం డ్ల పైబడిన మొక్కలను మంత్రి నాటి మాట్లాడారు. బైపాస్ రోడ్డుకు ఇరువైపులా విభిన్నమైన మొక్కలు నాటుతామని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చై ర్మన్ వెంకన్న, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, కమిషనర్ ప్ర దీప్కుమార్, కౌన్సిలర్లు, డీఈ, నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ అర్బన్, సెప్టెంబర్ 5 : సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో రహదారుల విస్తరణపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. మహబూబ్నగర్ మీదుగా భూత్పూర్ నుంచి చించోలి, దేవసూగూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు, పట్టణంలో జంక్షన్లు, రోడ్డు వెడల్పు పూర్తి చేసేలా సమీక్షలో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.