నారాయణపేట, మే 12 : రెండున్నర దశాబ్దా ల కిందట మొదలైన భూతగాదా ఆ కుటుంబాల్లో రక్తచరిత్ర సృష్టిస్తున్నది. నాటు బాంబులు, వేట కొడవళ్లతో హత్యలకు దారి తీస్తున్నది. ఆ నాటి నుంచి నేటి వరకు పగలు చల్లారడం లేదు. దా దాపు 15 ఏండ్ల నుంచి స్తబ్దుగా ఉన్న నారాయణపేట మండలంలోని అభంగాపూర్ గ్రామం.. నే డు వార్తలకెక్కింది. గురువారం హైదరాబాద్లోని నాగారంలో ఆశప్ప అలియాస్ అశోక్ హత్యకు గురికావడంతో గ్రామంలో కలకలం రేపుతున్నది. గ్రామంలో ఎప్పుడు ఎలాంటి ఘటన చోటు చే సుకుంటుందోనన్న భయం, పోలీసుల పికెటింగ్ మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ కే సులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే కొం దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.
మొదలైందిలా..
అభంగాపూర్ గ్రామంలో బురుజుకాడి చెన్నప్ప, ఆయన సోదరులు కిష్టప్ప, నారాయణ, బాలప్ప, వెంకటప్పకు.. ఆ శప్ప అలియాస్ అశోక్, ఆయన సోదరులకు 1999లో పొలం విషయంలో ఘర్షణ చోటుచేసుకున్నది. ఇందులో ఆశప్ప, ఆయన సోదరులు నర్సింహులు, కనకప్ప తీవ్రంగా గాయపడగా.. గ్రామం విడిచివెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత 1999 లోనే బురుజుకాడి చెన్నప్ప నివాసంపై నాటు బాంబులతో దాడి జరగగా.. ఆశప్ప వర్గీయులపై నారాయణపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా 2000లో నారాయణపేట కోర్టుకు ఆశప్ప, ఆయన సోదరులు హాజరుకాగా.. చెన్నప్ప వర్గీయులు నాటుబాంబులు, కత్తులతో కోర్టు ఆవరణలోకి వచ్చారు. గమనించిన పోలీసులు ఆ యుధాలను స్వాధీనం చేసుకొని చెన్నప్ప వర్గీయులపై కేసు న మోదు చేశారు. 2001లో మహబూబ్నగర్ నుంచి కోయిలకొండ మీదుగా అభంగాపూర్కు ఆర్టీసీ బస్సులో వస్తున్న క్ర మంలో చెన్నప్ప కుటుంబసభ్యులైన వెంకటయ్య, బుగ్గప్ప హ త్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఆశప్ప వర్గీయులపై కోయిలకొండ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
2004లో వా యిదా కోసం నారాయణపేట కోర్టుకు అభంగాపూర్ నుంచి ఆటోలో వస్తుండగా.. చెన్నప్ప వర్గీయులైన నారాయణ, దస్తప్పలు అప్పక్పల్లి-అప్పిరెడ్డిపల్లి మధ్య హత్యకు గురయ్యారు. ఇక్కడ ఆశప్ప వర్గీయులపై కేసు నమోదైంది. అప్పటినుంచి ఆశప్ప అజ్ఞాతంలో ఉంటూ ఎవరికీ తెలియకుండా గ్రామానికి వచ్చివెళ్లేవాడు. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అభంగాపూర్ బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. చెన్నప్ప కుటుంబం నుంచి బురుజుకాడి గోవిందమ్మ నామినేష న్ దాఖలు చేసింది. ఆశప్ప.. తన అన్న కో డలు లాలమ్మ, అన్న కూతురు వ ర్షతో అమ్మిరెడ్డిపల్లి క్లస్టర్లో నామినేషన్ వేయించాడు. ఎన్నికల్లో తన వారిని గెలిపించుకునేందుకు వచ్చిన ఆశప్పను జ నవరి 9, 2019న మరికల్ గ్రామ శివారులో వేట కొడవళ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన ఆశప్ప దవాఖానలో కోలుకున్నాడు.
అప్పటినుంచి అజ్ఞాతంలోనే ఉంటు న్న ఆశప్పను హైదరాబాద్ నాగారంలోని తన ఇంటి ఎదుట గురువారం నెంబర్ ప్లేట్ లేని కారులో వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. అభంగాపూర్ గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నారాయణపేట సీఐ రవిబాబు నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ, నారాయణపేట ఎస్సై సురేశ్గౌడ్, వీఆర్ ఎస్సై చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు గ్రామంలో పికెటింగ్ చేపడుతున్నారు.