అచ్చంపేట, మార్చి 18 : అమ్రాబాద్ టైగర్ రిజర్వు అనేక జీవ జాతులు, వృక్షాలు, జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నది. ఈ ప్రాంతం పులులకు నిలయం. లోతైన లోయలు, కనుమలు కలిగిన నల్లమల టైగర్ రిజర్వులో కొండ భూభాగం కృష్ణానది పరీవాహక ప్రాంతంగా ఉన్నది. నల్లమల అటవీప్రాంతం 2,611.4 చదరపు కిలోమీటర్ల వి స్తీర్ణంలో ఉంది. దట్టమైన అడవిలోని వన్యప్రాణులు తాగునీటి కోసం తండ్లాడే పరిస్థితులు దాపురించాయి. వేసవిలో వాగులు, బావులు, వంకలు ఎండిపోయాయి. అడవి ప్రాంతంలో ఉండే నీటి వనరులు, చెలిమెలు, వాగులు వంటి నీటి వనరులు ఎండిపోవడం తో వన్యప్రాణులు తాగునీటి కోసం ఇబ్బందిపడే పరిస్థితులు దాపురించాయి. ఈ కారణంగానే వేసవిలో వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వ స్తుంటాయి. ప్రతి ఏడాది మాదిరిగా ఈ సారి కూడా వే సవిలో అడవిలోని జీవాల నీటి గోస తీర్చేందుకు అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఆయా చోట్ల వన్యప్రాణులకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో 1,150 వరకు సాసర్పిట్లు ఉన్నాయి. వాటిలో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించడమే కాకుండా సమీప ప్రాంతాల్లో సహజ సిద్ధమైన నీటి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమై న ప్రాంతాల్లో 36 సోలార్పంపు సెంట్లు ఏర్పాటు చే శారు. మద్దిమడుగు, అమ్రాబాద్, మన్ననూర్, చారగొండ రేంజ్ పరిధిలో సోలార్ ద్వారా బోర్లు వేయించి నీటి వసతి కల్పించారు. సహజ సిద్ధమైన నీటి వనరులు ఉండే ప్రాంతాల్లో సోలార్ ద్వారా బోర్లువేసి గుంటలను నింపుతున్నారు. వన్యప్రాణులకు అవసరమైన పచ్చికను పెంచడంతోపాటు నీటి వనరులైన కుంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పులుల సం ఖ్య, మాంసాహార జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. వన్యప్రాణులకు ఆహారం, నీటి కొరత లేకుండాఅధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నల్లమల అ టవీప్రాంతంలో జింకలు, దుప్పులు, అడవిపందులు, కుందేళ్లు ఇతర శాఖాహార జంతువులు అధికంగా ఉన్నా యి. వానకాలంలో అయితే అడవిలో ఎక్కడ పడితే అ క్కడ నీళ్లు పుష్కలంగా ఉంటాయి. వన్యప్రాణులకు నీటి సమస్య ఉండదు. వేసవిలో ఎండల తీవత్రకు అడవి ఆకురాల్చి మైదానంగా కనిపిస్తుంది. నీటి వనరులైన కుంటలు, వాగులు ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణులు నిత్యం నీళ్లు తాగే వనరులు ఎండిపోవడంతో నీళ్ల కోసం బయటకు వస్తుంటాయి. దీనివల్ల వన్యప్రాణుల కు ప్రమాదం నెలకొంది. దీంతో అటవీశాఖ అధికారు లు వర్షాకాలంలో ఉండే ప్రధాన నీటి వనరులు వన్యప్రాణులు ఎక్కువగా పర్యటించే ప్రాంతాల్లో ఎండిపో యిన కుంటలు, వాగుల్లో నీళ్లను నింపుతున్నారు. వా గులు, కుంటల వద్ద సోలార్ బోర్లు వేసి వాటిని నింపుతున్నారు. దీంతో వన్యప్రాణులు నీళ్ల కోసం ఇబ్బందులు పడకుండా నిత్యం ఎక్కడ నీళ్లు తాగుతాయో అక్కడే నీటి సౌకర్యం కల్పించడం వల్ల జంతువులు బయటకు రావడానికి అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
నల్లమల అడవిలో సహజంగా ఉండే నీటి వనరులు వేసవిలో ఎండిపోయాయి. దీంతో వన్యప్రాణులకు నీటి సమస్య లేకుండా కావాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నాం. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో మొత్తం 1100పైగా సాసర్పిట్లు, సోలార్బోర్లు, కుంటలు ఉన్నాయి. అందులో ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా నీటి వసతి కల్పిస్తున్నాం. వన్యప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తు ఉంటాయో అక్కడ వసతులు కల్పిస్తున్నాం. వేసవిలో వన్యప్రాణుల శరీరంలో ఉప్పుశాతం తగ్గిపోతుంది. దీంతో సాసర్పిట్ల వద్ద మట్టితో కలిపి ఉప్పును ఉంచుతున్నాం. ఉప్పు, మట్టిని ముద్దగా చేసి సాసర్పిట్ల పక్కన ఉంచుతున్నాం. సాసర్ఫిట్ల వద్ద రెగ్యులర్గా జంతువులు వచ్చి నీళ్లు తాగి వెళ్తున్నాయి. వేసవిలో అవసరమైన ప్రదేశాల్లో నీటి వనరులు కల్పించి వన్యప్రాణులను కాపాడుకునేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం.