మహబూబ్నగర్, డిసెంబర్ 27 : నిరుపేదలను ఉ న్నత స్థాయికి తీసుకొచ్చేందుకు మంచి చేయాలనే తపనతో ప్రతి అధికారి పనిచేయాలని, అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జి ల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లతో ప్రజాపాలనపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దా మోదర రాజనర్సింహ, మంత్రి జూపల్లి కృష్ణారావు హా జరయ్యారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజూ షెడ్యూల్డ్ ప్రకారం అధికారులు పట్టణంలోని వార్డులు, గ్రామాలకు వెళ్లి 5 గ్యారెంటీల కు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వని వారు జనవ రి 6వ తేదీ వరకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శి లేదా ప్రత్యేకాధికారికి అందించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చే స్తుందని, ఇచ్చిన ప్రతి హామీని పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని ప్రజలకు వివరించాలని సూచించారు.
ప్రజలకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించడంలో సందేహాలు ఉన్నాయని, వాటిని ని వృత్తి చేయాల్సిన అవసరం ఉందని నారాయణపేట ఎ మ్మెల్యే పర్ణికరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్రెడ్డి సూచించారు. వచ్చే నెల 6వ తేదీ తరువాత కూడా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ ముందుగానే దరఖాస్తు ఫారం అందిస్తామని వనపర్తి కలెక్టర్ తేజస్నందలాల్పవర్ అన్నారు. అధికారులు ముందుగానే అందించిన ఫారాన్ని పూర్తి చేసి ప్రజాపాలన కార్యక్రమంలో అందిస్తే సరిపోతుందన్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రశీదును అందిస్తామని, కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయుడు, అనిరుధ్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
కొందరు ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నందున మహాలక్ష్మి ప థకం కింద ఎప్పటి నుంచి ల బ్ధిని అందజేస్తారో తెలియజేయాలి. ధాన్యం కొనుగోలు అనంతరం రూ.500 బోనస్ ఇస్తారని చెప్పారు. ఇప్పటికే రైతులు పండించిన ధాన్యం వి క్రయాలు దగ్గర పడుతున్నా యి. బోనస్పై ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. రైతు భరోసా అమలు చేసే తేదీని కూడా తెలపాలి.
గ్రామ జనాభాను పరిగణలోకి తీసుకొని వీలైనన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవాలి. అ ధికారులకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు త్వరగా తెలుస్తాయి. వారికి మరింత చేరువగా ఉంటూ సమస్యలను పరిష్కరించాలి. అందరి సహకారంతో విజయవంతం చేయాలి.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉ న్నా.. ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే ముందుకు సా గుతుంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం గ్యారెంటీల ను ఎప్పుడు అమలు చే స్తారో చెప్పడం లేదు. ప్రజలకు ఎన్నో సందేహాలు ఉ న్నాయి. వాటిని వివరించాల్సి న అవసరం ఎంతైనా ఉన్నది.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు ఇస్తారో చెప్పలేదు. ఇప్పటివరకు పింఛన్లు పొందుతున్న వారికి ఇస్తారా.. కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వాలి.