బిజినేపల్లి, జనవరి 28 : పాలెం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి విద్యా వ్యవస్థను పటిష్టం చే సిన మహాదానకర్ణుడు కీర్తిశేషులు సుబ్బయ్య (సుబ్రహ్యణ్య శర్మ) అని ఢిల్లీ యూజీసీ ఆర్జోషి అన్నా రు. ఆదివారం మండలంలోని పాలెం శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 1963-2023 వరకు పాలెంలోని వివిధ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా వజ్రోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలెం గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆనాడే గ్రామంలో అన్ని రకాల ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేసి విద్యను పంచి న మహోన్నత వ్యక్తి సుబ్బయ్య అని అన్నారు. వి ద్యార్థి దశ నుంచే ఉజ్వల భవిష్యత్తు ప్రారంభమవుతుందన్నారు. రానున్న రోజుల్లో పాలెం విద్యాల యం విశ్వ విద్యాలయంగా ఏర్పడబోతుందన్నారు. ఆనాడే ప్రాంతీ య వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రభుత్వ దవాఖాన, పాఠశాల, డిగ్రీ కళాశాల, ఆ లయం, హాస్టల్ వంటి సేవలను ఏర్పాటు చేయడం సుబ్బయ్య గొప్ప మనస్సుకు నిదర్శనమన్నారు.
గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన విద్య అం దించిన వ్యక్తి సుబ్బయ్య అని పాలమూరు యూనివర్సిటీ వైన్స్ చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అన్నారు. ఇక్కడ ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయని, సుబ్బ య్య సామాజిక సేవా పరిశ్రమలు గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించాయన్నారు. త్వరలోనే ఈ కళాశాలలో రెండు నూతనంగా పీజీ కోర్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
‘మా అమ్మ రామసీతమ్మ లేనిదే మా కుటుంబం లేదని, నాన్న సుబ్బయ్య చేసిన కృషి వెనుక ఆమె శ్రమ ఎంతో ఉంది’ సుబ్బయ్య కూతురు సుచిత్ర అన్నారు. ప్రతి సమావేశంలో సుబ్బ య్యే తెలుసునని, తమ తల్లిని గుర్తించలేదన్నారు. తన తండ్రి ప్రతి నిత్యం ప్రజల కోసం పనిచేసేవాడన్నారు. ఇక్క డ యూజీసీని ప్రారంభిస్తే మంచిదని సభాముఖం గా తెలియజేశారు.
పాలెం గ్రామ నిర్మాత అయిన పాలెం సుబ్బయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎ మ్మెల్యే రాజేశ్రెడ్డి అన్నారు. ఆయన గ్రామానికి చేసి న సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం ఆనాటి గురువులను పూలమాల, శాలువాలతో విద్యార్థులు సన్మానించారు. 60 బ్యాచ్లకు సంబంధించిన వి ద్యార్థులు ఒకే వేదికపైకి చేరుకోవడంతో కళాశాలలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భం గా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు పూర్వ విద్యార్థులను అలరింపజేశాయి. కార్యక్రమంలో జేడీ రాజేంద్రసింగ్, నాగర్కర్నూల్ ఇంటర్బోర్డు నోడల్ అధికారి వెంకటరమణ, ఏవీఎన్ రెడ్డి, రంగాచార్యు లు, డాక్టర్ గోపాల్, మల్లారెడ్డి, విద్యారాణి, ఆనంద్గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ లావణ్య, శ్రీనివాసులు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బుడ్డయ్య, మోహన్బాబు, బాలకిష్టయ్య, మల్లికార్జున్, లక్ష్మీకాంత్, సురేందర్, గోపాలస్వామి పాల్గొన్నారు.