హన్వాడ, డిసెంబర్ 22 : పేదల సంక్షేమానికి ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందాలని ఎంపీపీ బాలరాజు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీ కేం ద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడంలేదని, అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచాలని పలు గ్రామాల స ర్పంచులు కోరారు.
సీసీరోడ్ల బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, బిల్లులు పెం డింగ్లో లేకుండా చూడాలన్నా రు. మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో రుణాలు అందే లా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీవో ధనుంజయగౌడ్, కోఆప్షన్ సభ్యుడు మన్నాన్, డిప్యూటీ తాసిల్దార్ సతీశ్కుమార్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.