వనపర్తి/పెబ్బేరు/రేవల్లి, జనవరి 5 : సబ్బండ వర్గాల ప్రజల ఆశీస్సులే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తె లంగాణలో ఊహించని అభివృద్ధి జరుగుతున్నదన్నారు. గురువారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో పెబ్బేరు పట్టణంలోని 5వ వార్డుకు చెందిన బీ జేపీ కౌన్సిలర్ గోపిబాబుతోపాటు మరో 200 మంది మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అలాగే రేవల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు హనుమంతునాయక్ ఆధ్వర్యంలో పాతతండాకు చెందిన 40 మంది కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో పా ర్టీలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ, వైస్ చైర్మన్ కర్రె స్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, ఎంపీటీసీ సునీత, కౌన్సిలర్లు ఎల్లారెడ్డి, పద్మ, వేణు, సుమతి, రామకృష్ణ, మజీద్, పట్టణ అధ్యక్షుడు దిలీప్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జ్యోతి, సంతోష్, గణేశ్, నా యకులు గోవింద్నాయక్, రాములు నాయక్, పెద్దగోపా ల్, చిన్నగోపాల్, మంగ్య, సేవ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి పార్టీలోకి.. : ఎమ్మెల్యే మర్రి
నాగర్కర్నూల్, జనవరి 5 : మండలంలోని మంతటి సర్పంచ్ చిక్కొండ్ర నాగమణి నాగయ్యతోపాటు మరో 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్ లో వీరికి ఎమ్మెల్యే మర్రి కండువాలు కప్పారు. అలాగే మ ల్కాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నేత వెంకట్రెడ్డితోపాటు 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలో చేరారు.