వనపర్తి అర్బన్, ఆగస్టు 17 : రైతుల జీవన స్థితిగతులు, సాగు కమతాల స్వరూప స్వభావాన్ని తేల్చే వ్యవసాయ గణన కోసం జిల్లా గణాంక, వ్యవసాయశాఖలు సంయుక్తంగా సన్నద్దమవుతున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అధికారులు ఇప్పటికే శిక్షణ పొందారు. వ్యవసా య విస్తరణాధికారులు ప్రత్యేకంగా రూపొందించిన అగ్రిసెన్సెస్ యాప్ ద్వారా వ్యవసాయ సాగు గణన ప్రారంభించనున్నారు. ఈనెలాఖరు వరకు మొదటి దశ గణన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది.
మొదటి దశలో ఎంత మంది రైతులు, ఎంత భూ విస్తీర్ణం కలిగి ఉన్నారు, కౌలు రైతులు, సాగునీటి వసతితో సాగు, వర్షాధారం, బోరుబావులు, జలాశయాలు, సాగు కోసం చేస్తున్న ఖర్చులు, యాంత్రీకరణ, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు ఇలా సమగ్ర సమాచారాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు వివరాలు సేకరించనున్నారు. రైతు పేరు సామాజిక స్థితి, భూ విస్తీర్ణం వివరాలు, వ్యక్తిగత సాగు, ఉమ్మడి సాగు, సంస్థాగత సాగు, పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్ వారీగా అన్ని వివరాలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరిగి వ్యవసాయ విస్తరణాధికారులు నిర్దేశంచిన యాప్లో సేకరించనున్నారు. జిల్లాలోని 223 రెవెన్యూ గ్రా మాల్లో ఈ గణన చేపట్టనున్నారు. రైతుల వా రీగా కమతాల సంఖ్య, వి స్తీర్ణ, భూ వినియోగం వంటి వివరాలన్నీ సేకరిస్తారు. ప్రతి ఐదండ్లకోసారి చేయాల్సిన గణన గతంలో 2015-16లో మాత్రమే చేశారు. కరోనా పరిస్థితుల్లో చేపట్టలేకపోయారు. ప్రస్తుతం 2021-22 సంవత్సరం ప్రామాణికంగా తీసుకొని గణన చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
కమతల గణన మూడు దశల్లో చేయాల్సి ఉంటుంది. దానిలో మొదటి దశలో రైతు పేరు సామాజిక స్థితి,భూ విస్తీర్ణం వివరాలు,వ్యక్తి గత సాగు, ఉమ్మడి సాగు, సంస్థాగత సాగు, పురుషులు, మహిళలు, ట్రాన్స్జండర్ వారీగా అన్ని వివరాలను జిల్లాలోని 223 రెవెన్యూ గ్రామాల్లో తిరిగి వ్యవసాయ విస్తరణాధికారులు నిర్దేశంచిన యాప్లో సేకరించి నమోదు చేస్తారు. వివరాల నమోదు ఈనెలాఖరు వరకు పూర్తి చేయాల్సి ఉంది. రెండో దశలో ఎంపిక చేసిన 20శాతం గ్రామాల్లో భూ వినియోగం, పంటల సాగు, నీటి వసతి తదితర వివరాలను సేకరిస్తారు. మూడో దశలో ఏడుశాతం గ్రామాలను ఎంపిక చేసిన కమతాలలో ఎరువులు, క్రిమిసంహార మందుల వాడకం గురించి, పశుసంపద, వ్యవసాయ పరికరాల వినియోగం, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పంటలకు చేస్తున్న ఖర్చులు తదితర సమాచారం సేకరిస్తారు.
వ్యవసాయ గణన పర్యవేక్షణలో జిల్లాస్థాయిలో కలెక్టర్, ముఖ్య ప్రణాళికాధికారి కన్వీనర్గా, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా పశుగణనాధికారి, జిల్లా హర్టికల్చర్ అధికారి, జిల్లా ఇరిగేషన్ అధికారి సభ్యులుగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయిలో మండల విస్తరణాధికారులు 71 మంది గణకులుగా, మండల వ్యవసాయ అధికారులు 10మంది చార్జ్ ఆఫీసర్లుగా, ఉపగణాంక అధికారులు 3మంది కాగా, మండల ప్రణాళిక గణాంకాధికారులు 13 మంది పర్యవేక్షులుగా వ్యవహరిస్తూ సాంకేతిక సలహాలు ఇస్తారు.
గణనతో సన్న, చిన్న కారు, మద్యస్తం, పెద్ద రైతులు కమతాల వివరాలు ప క్కాగా తెలుస్తాయి. కౌలు రైతులు ఎందరన్న విషయం పూర్తిగా తెలిసిపోతుంది. గతం లో కంటే ఎంత మంది రైతులు యంత్ర పరికాలు వినియోగిస్తున్నారో తేలుతుంది. ఇవన్నీ జిల్లాలు, రాష్ర్టా లు, జాతీయ స్థాయిలో క్రోడీకరిస్తారు. తద్వారా భవిష్యాత్తులో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ఈ గ ణాంకాలు కీలకంగా మారుతాయి. ప్రభుత్వాలు రైతులకు సంక్షేమ పథకాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాల అమ లు చేసేందుకు ఈ గణన ద్వారా లభించే వివరాలనే ఆధారంగా చేసుకొనున్నారు. దీంతోపాటు రైతుల ఆదాయ, వ్యవయాలను పరిగణలోకి తీసుకొని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
అగ్రిసెన్సెస్ యాప్లో వివరాల నమోదు..
మొట్ట మొదటి సారిగా ఏఈవోలకు ధరణి పోర్టల్లో నిర్దేశించిన సీసీఎల్ఏ భూముల వివరాలను ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం అగ్రిసెన్సెస్ పేరిట ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందించింది. ఏఈవోలు డౌన్లోడ్ చేసుకొని గణనను పూర్తి చేయనున్నారు. వివరాల నమోదుపై అధికారులు అవగాహన కల్పించారు.
జిల్లాలో వ్యవసాయ గణనకు అంతా సిద్ధం చేశాం. క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది రెండు రోజుల నుంచి గణన చేస్తున్నారు. ఏఈవోల ఆధ్వర్యంలో వివరాలు సేకరించ నున్నారు. జిల్లా వ్యాప్తంగా 2021-22 ప్రామాణికంగా మహిళా రైతులు 30,196 మంది, పురుషులు 97,503 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం లక్షా 40వేల 693 ఉన్నది. ఈ నెల 15 వతేదీ వరకు మొదటి దశ గణన పూర్తి చేయాల్సి ఉంది.
– వెంకటరమణ, వనపర్తి జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి