మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నది. మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్దింది. దేశంలో ఎక్కడాలేనివిధంగా 200లకుపై మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. నిరుద్యోగ మైనార్టీ యువతకు సబ్సిడీ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మైనార్టీ ఆర్థిక సంస్థ ద్యారా రాష్ట్ర వ్యాప్తంగా 5వేల మందికి రూ.50కోట్ల రుణాలిచ్చేందుకు నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 460 యూనిట్లు కేటాయించనున్నారు. యూనిట్లను రెండు భాగాలుగా విభజించారు. యూనిట్-1లో రూ.లక్ష, యూనిట్-2లో 2లక్షల సబ్సిడీ రుణాలు అందజేస్తారు. యూనిట్-1కి 80శాతం, యూనిట్-2కు 70 శాతం సబ్సిడీని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అందిస్తుంది.
జిల్లాలోని నిరుద్యోగ మైనార్టీ యువత నేటినుంచి సబ్బిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రెండు వారాలపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. మైనార్టీవర్గానికి ముస్లింలు, క్రిష్టయన్, సిక్కులు, పార్శిలు, బౌద్ధులు, జైనులు ఉండి 21ఏండ్ల నుంచి 55ఏండ్లు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలవారి వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలోపు ఉండాలి. దరఖాస్తుదారులు ఆధార్కార్డు, తెల్లరేషన్కార్డు, ఆహారభద్రత కార్డుతో http://tsobmms.cgg.gov.in లేదా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్సైట్ tsmf.in లో ఈనెల 19 నుంచి జనవరి5 తేదీ వరకు ఆన్లైన్ రిజిస్టేషన్ చేసుకోవాలి. మహబూబ్నగర్ జిల్లాకు 130, నాగర్కర్నూల్ 100, వనపర్తి, గద్వాల, నారాయణపేటకు 70-80 యూనిట్లు మంజూరు కానున్నాయి.
మైనార్టీ నిరుద్యోగ యువత కోసం సబ్బిడీ రుణాలు అందజేసి వారి ఉపాధి అవకాశలు కల్పించేందుకు రాయితీ రుణాలు అందజేయనున్నారు. కొంతమంది నిరుద్యొగ యువతను దళారులు రుణాలు ఇప్పిస్తామని మోసం చేస్తారు. ఇలాంటి వల్లను నమ్మోద్దు. తెలంగాణ ఏర్పడకముందు గతంలో కొంతమంది దళారులు బ్యాంకర్లతో ఒప్పంద చేసుకొని దందా నడిపి ఘటలు ఉన్నాయి. పూర్తి పారదర్శంగా రుణాలు ఇచ్చేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. బయట, మైనార్టీ కార్యాలయంలో కాని రుణాలు ఇస్తామని నమ్మిస్తే వెంటనే మైనార్టీ ఉన్నత శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. రుణాలకు సంబంధించి సందేహాలు ఉంటే నేరుగా మైనార్టీ సంక్షేమాశాఖ కార్యాలయం వెళ్లి నివృత్తి చేసుకోవాలి.
తెలంగాణలో అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పేద్దపీట వేస్తున్నది. మైనార్టీ నిరుద్యోగ యువతకు సబ్బిడీ రుణాల అందజేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేసింది. రూ.1లక్ష, 2లక్షల రుణ రాయితీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దళారులను నమ్మొదు. మీ సేవా కేంద్రాల్లో నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాకు మరి న్ని యూనిట్లు తె చ్చేందుకు కృషి చేస్తా.
– ఇంతియాజ్ఇసాక్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
నిరుద్యోగ మైనార్టీ యువతకు సబ్బిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి. జవవరి 5వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందకు అవకాశం కల్పించారు. మైనార్టీవర్గానికి చెందిన ముస్లింలు, క్రిష్టియన్, సిక్కులు, పార్శిలు, బౌద్దులు, జైనులు ఉండి 21ఏండ్ల నుంచి 55ఏండ్లల మధ్య వయస్సు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం లక్షా 50వేలు, పట్టణ ప్రాంతాల్లో 2లక్షలోపు ఉండాలి.
– శంకరాచారి, జిల్లా మైనార్టీ,సంక్షేమశాఖ అధికారి