నాగర్కర్నూల్, సెప్టెంబర్ 23: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో టాలీవుడ్ అందాల తార కేథరీన్ సందడి చేసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ను యాజమాన్యంతో కలిసి ఆమె రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. దేశంలోని అతిపెద్ద వస్త్ర సామ్రాజ్యాలలో ఒకటైన మాంగళ్య షాపింగ్మాల్ 14వ బ్రాంచ్ను ప్రారంభానికి వందలాదిగా ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. మాంగళ్య షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు పి.ఎన్.మూర్తి, చైర్మన్ కాసం నమఃశివాయ, మాంగళ్య షాపింగ్ మాల్స్ డైరెక్టర్లు కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
సువిశాలంగా ఏర్పాటైన మాల్ పట్టణానికి మైలురాయి అవుతుందన్నారు. గతంలో నాగర్కర్నూల్వాసులు పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు షాపింగ్కోం హైదరాబాద్ వెళ్లేవారన్నారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ పట్టణంలోనే కావాల్సినవన్నీ ఒకేచోట వచ్చాయన్నారు. మాంగళ్య షాపింగ్మాల్ ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నామని కాసం నమ:శివాయ తెలిపారు.